
జన్మభూమిరోడ్డు సమీప ఖాళీ స్థలంలో..
ఖిలా వరంగల్: వరంగల్ రైల్వేగేట్ ప్రాంతం 33, 37, 38, 39 డివిజన్ల పరిధి లక్ష్మీనగర్, సాకరాసికుంట, విద్యానగర్, కాశికుంట, శంభునిపేట బుడుగజంగాలకాలనీ, గిరిప్రసాద్నగర్, గణేష్నగర్ కాల నీ, విశ్వనాథకాలనీ, సుభాష్నగర్, మధ్యకోట, పడమరకోట కాలనీల్లోని ఇళ్ల మధ్య ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉన్నాయి. ఏళ్ల తరబడి అలానే ఉండడంతో పిచ్చిమొక్కలు పెరిగి మురుగునీరు నిలుస్తోంది. ‘దోమల స్వైర విహారంతో ప్రజలకు కంటి మీద కనుకులేకుండా పోతోంది. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాల బారినపడుతున్నారు.. అధికారులు స్పందించాలి’ అని వరంగల్ ఫోర్ట్రోడ్డుకు చెందిన సిద్దం రాము కోరారు.

సిద్దం రాము