వరంగల్ చౌరస్తా: అసెంబ్లీ ఎన్నికల్లో బీఎల్ఎఫ్ కూటమి 119 స్థానాల్లో పోటీ చేస్తుందని ఎంసీపీఐ(యూ) వరంగల్ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు. ఆదివారం ఐతం నాగేష్ అధ్యక్షతన అండ ర్ బ్రిడ్జి ప్రాంతంలోని ఓంకార్ భవన్లో జరిగిన వరంగల్ నగర కమిటీ సమావేశంలో ఆయన మా ట్లాడుతూ 2018 సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలోని హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. కొత్త పథకాల పేరిట ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనం, ప్రకృతి సంపదను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. తద్వారా సంక్షేమానికి బదులు ప్రజా సంక్షోభం ఏర్పడే విధంగా పాలక ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. రాబోయే మూడు నెలల్లో పెనుమార్పులు సంభవించనున్నాయని, ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత సంక్షోభంలో కి వెళ్తుందని తెలిపారు. జిల్లా సహాయ కార్యదర్శి నర్రా ప్రతాప్, రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబ బా బురావు, నగర కార్యదర్శి జగదీశ్వర్, నాయకులు రాయినేని ఐలయ్య కొమురయ్య పాల్గొన్నారు.
ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి రమేష్