కాజీపేట జంక్షన్‌లో స్వచ్ఛ ఆహార్‌ | - | Sakshi
Sakshi News home page

కాజీపేట జంక్షన్‌లో స్వచ్ఛ ఆహార్‌

Sep 25 2023 1:20 AM | Updated on Sep 25 2023 1:20 AM

- - Sakshi

కాజీపేట రూరల్‌: కాజీపేట జంక్షన్‌లో రైల్వే అధికారులు స్వచ్ఛ పక్షోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వచ్ఛ ఆహార్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైల్వేస్టేషన్‌లోని అన్ని రైల్వే స్టాళ్ల వద్దకు వెళ్లి పరిశుభ్రత, తినుబండారాలు, విక్రయించే వారి డ్రెస్‌ కోడ్‌, ఐడీ కార్డులను పరిశీ లించినట్లు రైల్వే చీఫ్‌ హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ డి.రాజేశ్‌ తెలిపారు. స్టాళ్ల నిర్వాహకులకు పలు సూచనలు చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో కాజీపేట రైల్వేస్టేషన్‌ మేనేజర్‌ సత్యనారాయణరెడ్డి, కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ సజ్జన్‌లాల్‌ ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

నేడు, రేపు ‘ఉన్నతి’పై పరీక్షలు: డీఈఓ

విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్యాల ఉన్నత పాఠశాలల్లో ఈనెల 25, 26 తేదీల్లో ఉన్నతి కార్యక్రమం అమల్లో భాగంగా ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు బేస్‌లైన్‌ పరీక్షలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అఽధికారి ఎండీ అబ్దుల్‌హై ఆదివారం తెలిపారు. ఈనెల 25న తెలుగు, హిందీ, ఆంగ్లం, ఉర్దూకు సంబంఽధించి బేస్‌లైన్‌ పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈనెల 26న భాషేతర సబ్జెక్టులు గణితం, సామాన్య, సాంఘిక, జీవశాస్త్రం, భౌతికశాస్త్రానికి సంబంధించి బేస్‌లైన్‌ పరీక్షలు నిర్వహించాలని డీఈఓ ఆదేశించారు.

నేటి గ్రేటర్‌ గ్రీవెన్స్‌ రద్దు

వరంగల్‌ అర్బన్‌: గ్రేటర్‌ వరంగల్‌ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌ రద్దు చేసినట్లు కమిషనర్‌ షేక్‌ రిజ్వాన్‌బాషా ఒక ప్రకటనలో తెలిపారు. పరిపాలనా పరమైన కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రజలు గమనించి గ్రీవెన్స్‌కు ఫిర్యాదులతో రాకూడదని విజ్ఞప్తి చేశారు.

హనుమకొండ గ్రీవెన్స్‌..

హన్మకొండ అర్బన్‌ : హనుమకొండ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌ రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ సిక్తాపట్నాయ క్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పరిపాలనా పరమైన కారణాలతో గ్రీవెన్స్‌ నిర్వహించడం లేదని, ప్రజలు గమనించాలని కోరారు.

వరంగల్‌ గ్రీవెన్స్‌..

కరీమాబాద్‌: వరంగల్‌ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌ రద్దు చేసినట్లు కలెక్టర్‌ ప్రావీణ్య ఒక ప్రకటనలో తెలిపారు. పరిపాలనాపరమైన కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రజలు గమనించి కార్యాలయానికి అర్జీలతో రావొద్దని కోరారు.

పోలీస్‌ గ్రీవెన్స్‌..

వరంగల్‌ క్రైం: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో సోమవారం నిర్వహించే పోలీస్‌ గ్రీవెన్స్‌ అనివా ర్య కారణాలతో రద్దు చేసినట్లు కమిషనర్‌ ఏవీ. రంగనాథ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదుదారులు ఈవిషయాన్ని గమనించి కార్యాలయానికి రావొద్దని సూచించారు.

నేడు మూడో రైల్వే లైన్‌

ప్రారంభం

కాజీపేట రూరల్‌: కాజీపేట సబ్‌ డివిజన్‌ పరిధి సిర్పూర్‌ కాగజ్‌నగర్‌–

మకోడి స్టేషన్ల మధ్య దాదాపు 30 కిలోమీటర్ల వరకు నిర్మించిన థర్డ్‌లైన్‌ను సోమవారం ప్రారంభించనున్నట్లు ఆదివారం రైల్వే అధికారులు తెలిపారు. వయా కాజీపేట మీదుగా బల్లార్షా–విజయవాడ మధ్య ప్రతిష్టాత్మకంగా మూడో రైల్వే లైన్‌ను నిర్మిస్తున్నారు. నెల రోజుల పాటు అన్ని విభాగాల అధికారులు, కార్మికులు రాత్రీ పగలు శ్రమించారు. ఈ లైన్‌ను దక్షిణ మధ్య రైల్వే సేఫ్టీ కమిషనర్‌ అధికారులు, ఇంజనీరింగ్‌ అధికారులు సోమవారం ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

చీఫ్‌ విప్‌ను కలిసిన

ఐటీ కంపెనీ ప్రతినిధులు

హన్మకొండ: రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ను హైక్సెడ్‌ ఐటీ కంపెనీ ప్రతినిధులు ఆదివారం కలిశారు. హైదరాబాద్‌ తర్వాత ఐటీ రంగానికి వరంగల్‌ను గమ్యస్థానంగా మారుస్తున్నందుకు కంపెనీ సీఈఓ రాజేశ్‌, ప్రతినిధులు హనుమకొండ 100 ఫీట్ల రోడ్డులో వినయ్‌భాస్కర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పి సన్మానించారు. ఇందులో ‘కుడా’ చైర్మన్‌ సంగంరెడ్డి సుందర్‌రాజ్‌ యాదవ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అజీజ్‌ఖాన్‌ పాల్గొన్నారు.

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement