
బాపూజీనగర్ బూడిదిగడ్డ ప్రాంతంలో..
కాజీపేట రూరల్: కాజీపేట 47వ డివిజన్ బాపూజీనగర్ (బూడిదిగడ్డ) డ్రెయినేజీలో మొక్కలు పెరిగాయి. చెత్త, చెదారం పేరుకుపోవడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. కాలనీవాసులు అనారోగ్యం బారిన పడుతున్నారు. రెగ్యులర్గా ఫాగింగ్ చేయకపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయి. ఇళ్లల్లోకి పాములు వస్తున్నాయి. డీజిల్కాలనీ పెట్రోల్ బంక్ వెనకాల ఉన్న రోడ్డు మార్గంలో వర్షపు నీరు చేరడంతో స్థానికులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. డ్రెయినేజీ వాటర్ బ్లాక్ కావడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మొక్కలు మొలిచి.. నీళ్లు నిలిచి