ప్రజల అవస్థ | - | Sakshi
Sakshi News home page

ప్రజల అవస్థ

Sep 24 2023 1:24 AM | Updated on Sep 24 2023 1:24 AM

సాకరాసికుంటలో చెత్తతో నిండిన ప్రధాన డ్రెయినేజీ 
 - Sakshi

సాకరాసికుంటలో చెత్తతో నిండిన ప్రధాన డ్రెయినేజీ

గ్రేటర్‌ వరంగల్‌ మహా నగరంలో పారిశుద్ధ్య వ్యవస్థ సరిగ్గా లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. బల్దియా పాలన గాడి తప్పి నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న వాన పడితే చాలు.. ఆయా కాలనీల్లో రోడ్లు చిత్తడిగా మారుతున్నాయి. చెత్త ఎక్కడికక్కడే పేరుకుపోతోంది. చెత్తను సేకరించే ఆటోలు కొన్ని కాలనీల్లో వారానికోసారి కూడా కనిపించట్లేదు. దీంతో రోడ్లపైనే చెత్తను పడేస్తున్నారు. జనావాసాల మధ్య మురుగునీరు చేరి దోమలు, ఈగలు విజృంభిస్తున్నాయి. స్థానికులు అనారోగ్యం బారిన పడుతున్నారు. నగరంలోని పారిశుద్ధ్య సమస్యపై ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్ట్‌.

పారిశుద్ధ్య

వ్యవస్థ...

ఖిలా వరంగల్‌: వరంగల్‌ 33, 37, 38, 39, 41 డివిజన్లలోని ప్రధాన డ్రెయినేజీల్లో చెత్త తీయరు. ఒకవేళ తీసినా రోడ్డుపైనే పడేస్తారు. వారం దాటినా దాన్ని తొలగించకపోవడంతో మళ్లీ డ్రెయినేజీలోనే కలుస్తోంది. రోడ్లపై పడేసిన చెత్త కుళ్లి దుర్వాసన వస్తోంది. వరంగల్‌ 39వ డివిజన్‌ సాకరాసికుంటలో ప్రధాన డ్రెయినేజీ చెత్తాచెదారంతో నిండింది. 41వ డివిజన్‌లో డ్రెయినేజీలో మురుగు నీరు పారట్లేదు. పలు కాలనీల్లో సేకరించిన చెత్తను 41వ డివిజన్‌ శంభునిపేట నుంచి పడమరకోటకు వెళ్లే దారి రోడ్డుకు ఇరువైపులా డంపింగ్‌ చేస్తున్నారు.

చెత్త తీయరు.. డంప్‌ చేయరు

గ్రేటర్‌లో లోపించిన

పారిశుద్ధ్యం

జనావాసాల మధ్య మురుగునీరు

ఎక్కడికక్కడే పేరుకుపోయిన చెత్త

డ్రెయినేజీల్లో నిండిన చెదారం

అనారోగ్యం బారిన పడుతున్న స్థానికులు

క్షేత్రస్థాయిలో ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్ట్‌

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement