
నిట్ దర్గా రోడ్డులో..
హన్మకొండ అర్బన్: హనుమకొండ 49వ డివిజన్ పరిధిలోని దర్గా 100పీట్ల రోడ్డులో డ్రెయినేజీ పరిస్థితి పూర్తి అధ్వానంగా ఉంది. గతేడాది మురుగు నీటి శుద్ధ్ది పేరుతో ఎస్టీపీ నిర్మాణం కోసం దర్గా రోడ్డును పూర్తిగా ధ్వసం చేసి పైప్లైన్ వేశారు. రెండేళ్లుగా ఇది కొనసాగుతోంది. ఈ క్రమంలో నిట్ నుంచి వచ్చే మురుగు నీరు వెళ్లే కాల్వలు పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో రోడ్డుపైనే మురుగు పారుతోంది. ఈ ప్రాంతంలో హోటళ్లు ఎక్కువగా ఉండడం వల్ల మిగిలిన ఆహారం రోడ్డుపైనే వేస్తున్నారు. దీంతో దుర్వాసన వస్తోంది.
నిట్ మురుగు.. దర్గా రోడ్డుపై పరుగు