
మాట్లాడుతున్న డీఎంహెచ్ఓ వెంకటరమణ
గీసుకొండ : అసంక్రమిత వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ డాక్టర్ కె.వెంకటరమణ అన్నారు. అధిక రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, పక్షవాతం, నోటి, గర్భస్థ, రొమ్ము క్యాన్సర్లను ముందస్తుగా గుర్తించి వైద్యాధికారుల పర్యవేక్షణలో చికిత్స అందించాలని ఆయన సూచించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో అసంక్రమిత వ్యాధుల నిర్మూలనపై శుక్రవారం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అన్ని వైద్య సేవలను ఆయుష్మాన్ భారత్ పోర్టల్లో ప్రతిరోజూ అప్డేట్ చేయాలన్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పరిశీలకుడు డాక్టర్ శ్రావణ్రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల్లో అసంక్రమిత వ్యాధులపై అవగాహన కలిగించాలన్నారు. ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ గోపాల్రావు, కోఆర్డినేటర్ ప్రకాశ్రెడ్డి, వైద్యాధికారులు, స్టాఫ్ నర్సులు, డిప్యూటీ డెమోలు పాల్గొన్నారు.