
మాట్లాడుతున్న మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్: కీటక, నీటిజనిత వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని నగర మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. శుక్రవారం వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్లో ఆమె ప్రజారోగ్యం, శానిటేషన్ అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. వర్షాకాలంలో దోమల వ్యాప్తిని అరికట్టడం ద్వారా వ్యాధులను నియంత్రించవచ్చని పేర్కొన్నారు. విధిగా ఫాగింగ్, ఆయిల్బాల్స్ వేయాలని, మురికికాల్వలు నిరంతరం శుభ్రం చేయాలని ఆదేశించారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు, హెల్త్ ఇన్స్పెక్టర్లు సమన్వయంతో పర్యవేక్షించాలన్నారు. ‘స్వచ్ఛతా హి సేవా’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్కు అనుగుణంగా కార్యక్రమాలను రూపొందించి అమలు చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ అనిసుర్ రషీద్, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, బయాలాజిస్ట్ మాధవరెడ్డి, శానిటరీ సూపర్వైజర్స్ సాంబయ్య, భాస్కర్, నరేందర్, హెల్త్ ఇన్స్పెక్టర్లు మధుకర్, రవి పాల్గొన్నారు.
భవన నిర్మాణాల్లో నిబంధనలు పాటించండి
టీఎస్–బీపాస్లో అనుమతులు, నిబంధనల్ని పక్కాగా పాటించాలని కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. టీఎస్– బీపాస్ ద్వారా భవన నిర్మాణాల కోసం దరఖాస్తు చేసిన నిర్మాణాల స్థలాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. బాలసముద్రం, వికాస్ నగర్, ఎన్జీఓస్ కాలనీ, ఎకై ్సజ్ కాలనీ, టీచర్స్ కాలనీ, ప్రశాంత్ నగర్, ప్రకాశ్రెడ్డిపేట, ఐడియా స్కూల్ ప్రాంతం, న్యూ శాయంపేట జాగీర్, రంగంపేట తదితర ప్రాంతాల్లో పర్యటించి పరిశీలించారు.