అత్యవసరమైనా సెలవుల్లేవ్‌! | - | Sakshi
Sakshi News home page

అత్యవసరమైనా సెలవుల్లేవ్‌!

Sep 23 2023 1:22 AM | Updated on Sep 23 2023 1:22 AM

- - Sakshi

హన్మకొండ: వరంగల్‌ ఆర్టీసీ రీజియన్‌ పరిధిలోని వరంగల్‌–1 డిపోలో వేధింపులు, పనిభారం, నిర్ణీత సమయానికి మించి విధులు నిర్వహించడం, వెల్ఫేర్‌ కమిటీ సభ్యుల చీదరింపుల మధ్య విధులు నిర్వహించాల్సి వస్తోందని కార్మికులు వాపోతున్నా రు. ఆర్టీసీలో కార్మిక సంఘాలను పక్కన పెట్టిన ప్రభుత్వం వారి స్థానంలో ఉద్యోగుల ప్రతినిధులు గా వెల్ఫేర్‌ కమిటీలు ఏర్పాటు చేసింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పాటుపడాల్సిన వెల్ఫేర్‌ కమిటీ సభ్యులు అధికారుల ప్రాపకం కోసం పాకులాడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అత్యవసరమైనా సెలవులు ఇచ్చేది లేదని, చేస్తే ఉద్యోగం లేకపోతే అంతే సంగతులని భయపెడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. డిపో మేనేజర్లు మారి నా తమ వెతలు తీరడం లేదని కార్మికులు ఆందోళ న వ్యక్తం చేస్తున్నారు. దీంతో సింగిల్‌ క్రూ డ్యూటీలు, వర్క్‌లోడ్‌ భరించలేక కొంతమంది కండక్టర్లు, డ్రైవర్లు ఇతర డిపోలకు బదిలీ పెట్టుకుని వెళ్లిపోతున్నారని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు.

అంతా వెల్ఫేర్‌ కమిటీ సభ్యుడిదే హవా?

వరంగల్‌–1 డిపో పరిధిలో మొత్తం 164మంది కండక్టర్లు, ...208మంది డ్రైవర్లు ఉన్నారు. ఈ డిపోలో 8 గంటల డ్యూటీ అనేది లేదని కార్మికులు చెబుతున్నారు. ఇటీవల ఓ కార్మికుడు తమ సమస్య చెప్పుకునేందుకు రీజినల్‌ మేనేజర్‌ను కలిసేందుకు వెళ్తే వెల్ఫేర్‌ కమిటీ సభ్యుడు ఆర్‌ఎం కార్యాలయం మెట్లు కూడా ఎక్కనివ్వలేదని తోటి కార్మికులు ‘సాక్షి’తో తెలిపారు. పైగా ఫలానా ఉద్యోగి ఆర్‌ఎంను కలిసేందుకు వెళ్తున్నారని డిపో మేనేజర్‌కు చాడీలు చెబుతున్నట్లు మండిపడ్డారు. వెల్ఫేర్‌ సభ్యుడి చాడీలు చూసి ఎప్పుడు ఎవరిపై అధికారులకు చెడుగా చెబుతాడోనని వణుకుతున్నారు. రీజినల్‌ మేనేజర్‌ ఉద్యోగుల సమస్యలు వింటూ పరిష్కరించే ప్రయత్నం చేస్తుంటే డిపో మేనేజర్‌, సూపర్‌ వైజర్లు, వెల్ఫేర్‌ కమిటీ సభ్యుడు వ్యవహరించే తీరు చాలా దుర్మార్గంగా ఉందని, ఉద్యోగులను చాలా చులకనగా చూస్తున్నారని వాపోతున్నారు.

వేధింపులు, పనిభారం ఇలా..

ఆడ, మగ తేడా లేకుండా ప్రతి ఉద్యోగి రోజుకు 12 గంటల చొప్పున వారం రోజులు నిర్విరామంగా విధులు నిర్వహించాలి.

ఆర్టీసీ డిస్పెన్షరీకి వెళ్లినా సిక్‌ లీవ్‌ ఇవ్వకపోవడంతో ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా కుంగిపోతున్నారు.

బంధువులు చనిపోయినా, కుటుంబ సభ్యుల శుభకార్యాలున్నా సెలవులు ఇవ్వడం లేదని, దీంతో వారిముందు పరువు పోగొట్టుకోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

డిపోలో స్పెషల్‌ ఆఫ్‌ డ్యూటీలు లేకుండా చేశారని, సింగిల్‌ క్రూ డ్యూటీలతో అలిసిపోతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు.

హైదరాబాద్‌ రూట్‌ డ్యూటీలు చేసే ఉద్యోగులు 8 గంటలకు బదులుగా 12 గంటలు చేయాల్సి వస్తోంది.

డిపోలోనుంచి బస్టాండ్‌ పాయింట్‌ పైకి బస్సు చేరుకోవడానికి క్యూలోనే 2 గంటలు గడిచిపోతోందని, హైదరాబాద్‌ తిరుగు ప్రయాణంలో నూ మరో రెండు గంటలు నిరీక్షణలోనే గడిచిపోతోందని, దీంతో 8 గంటల డ్యూటీని 12 గంట లు చేయాల్సి వస్తోందని ఉద్యోగులు తెలిపారు.

ఆర్టీసీ వరంగల్‌ డిపో–1

కార్మికుల కష్టాలు

డీఎంలు మారినా తీరని వెతలు

వెల్ఫేర్‌ కమిటీ సభ్యుడి ఇష్టారాజ్యం

నిర్ణీత సమయానికి మించి విధులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement