ఐదేళ్ల లా కోర్సు ఆరో సెమిస్టర్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల లా కోర్సు ఆరో సెమిస్టర్‌ పరీక్షలు

Sep 23 2023 1:22 AM | Updated on Sep 23 2023 1:22 AM

- - Sakshi

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఐదేళ్ల లా కోర్సు ఆరో సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 25వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి పి.మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ సీహెచ్‌.రాధిక శుక్రవారం తెలిపారు. ఈ నెల 25, 27, 30, అక్టోబర్‌ 4, 6 తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. మరిన్ని వివరాలు సంబంధిత వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

27న డిగ్రీ ఆరో సెమిస్టర్‌ ఇన్‌స్టంట్‌..

డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ ఆరో సెమిస్టర్‌ ఇన్‌స్టంట్‌ పరీక్షను ఈ నెల 27వ తేదీన మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహిస్తామని అధికారులు పి.మల్లారెడ్డి, తిరుమలాదేవి తెలిపారు.

నేడు దివ్యాంగుల గ్రీవెన్స్‌

కాజీపేట అర్బన్‌: దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్‌ సెల్‌ను శనివారం హనుమకొండ కలెక్టరేట్‌లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఇన్‌చార్జ్‌ అధికారి మధురిమ శుక్రవారం తెలిపారు. ఈ అవకాశాన్ని దివ్యాంగులు తమ సమస్యల పరిష్కారానికి వినియోగించుకోవాలని కోరారు.

వరంగల్‌లో..

కాళోజీ సెంటర్‌ : దివ్యాంగులు, వయోవృద్ధులకు శనివారం వరంగల్‌ కలెక్టరేట్‌లో గ్రీవెన్స్‌ డే నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి శారద ఒక ప్రకటనలో తెలిపారు.

సర్పగణపతిగా పూజలు

హన్మకొండ కల్చ రల్‌ : వేయిస్తంభాల దేవాలయంలో జరుగుతున్న శ్రీఉత్తిష్ట గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం మూలమహా గణపతిని సర్పగణపతిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం నుంచి శ్రీరుద్రేశ్వరస్వామివారికి రుద్రాభిషేకం, పూజలు చేశారు. ఉత్సవమూర్తికి షోడశోపచారపూజలు జరిగాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సాయంత్రం పి.శ్రీనందిని శిష్యబృందం ప్రదర్శించిన శాసీ్త్రయ నృత్యాలు అలరించాయి. ఈఓ వెంకటయ్య పర్యవేక్షించారు.

ఎన్నికల నిర్వహణకు

సన్నద్ధం కావాలి : సీపీ

వరంగల్‌ క్రైం: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పోలీస్‌ అధికారులు సన్నద్ధం కావాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఏవీ.రంగనాథ్‌ సూచించారు. శుక్రవారం కేయూలోని సెనేట్‌ హాల్‌లో కమిషనరేట్‌ పరిధి పోలీస్‌ అధికారులతో నిర్వహించిన సమావేశంలో సీపీ మాట్లాడారు. ఎన్నికల తేదీలు ప్రకటించాక ఎన్నికల ముందు, తర్వాత రోజు చేయాల్సిన విధులు, నియమ, నిబంధనలు, సమాచార సేకరణ, మద్యం, డబ్బుల పంపిణీపై దృష్టి పెట్టాలని తెలిపారు. ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు డబ్బులు, మద్యం, బహుమతులను పంపిణీ చేసే సమయంలో దొరికితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలనే అంశాలపై చర్చించారు. పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చెక్‌ పోస్టుల ఏర్పాటు, డబ్బు, మద్యం పంపిణీ మార్గాలు, వాటి నివారణకు చేపట్టాల్సిన చర్యలు, గంజాయి, గుడుంబా, పటిక నియంత్రణ, రౌడీషీటర్ల బైండోవర్లపై దిశానిర్దేశం చేశారు. డీసీపీలు దాసరి మురళీధర్‌, రవీందర్‌, అబ్దుల్‌ బారి, సీతారాం, అదనపు డీసీపీలు రాగ్యానాయక్‌, సంజీవ్‌, సురేశ్‌కుమార్‌, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.

నేడు స్పాట్‌ అడ్మిషన్లు

హన్మకొండ: వరంగల్‌లోని టీఎస్‌ ఆర్టీసీ ఐటీఐలో ఖాళీగా ఉన్న సీట్లను శనివారం స్పాట్‌ అడ్మిషన్‌ ద్వారా భర్తీ చేయనున్నట్లు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పోస్టు చేశారు. వరంగల్‌ ములుగు రోడ్డులోని టీఎస్‌ ఆర్టీసీ జోనల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కళాశాలలో నిర్వహిస్తున్న ఐటీఐలో మోటార్‌ మెకానిక్‌, డీజిల్‌ మెకానిక్‌, వెల్డర్‌, పెయింటర్‌ ట్రేడ్‌లలో ఖాళీలు ఉన్నాయని వివరించారు. వీటిని స్పాట్‌ అడ్మిషన్‌ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలి పారు. విద్యార్థులు ఈఅవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 98494 25319, 80081 36611 నంబర్‌లలో సంప్రదించాలని సూచించారు. ఇందులో కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సంస్థలోనే అప్రెంటిస్‌షిప్‌ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు.

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement