
మాట్లాడుతున్న నగర మేయర్ సుధారాణి
మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్: నగర పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. మంగళవారం వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్లో గ్రేటర్ పరిధిలోని పరకాల, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజవర్గాల పరిధిలో వివిధ పథకాల కింద కొనసాగుతున్న అభివృద్ధి పనులపై ఇంజనీరింగ్ ఆధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఆయా నియోజకవర్గాల పరిధిలో పట్టణ ప్రగతి, ముఖ్యమంత్రి హమీ నిధులు (సీఎంఏ), స్మార్ట్ సిటీ పథకంతో కొనసాగుతున్న అభివృద్ధి పనులను నిర్ధేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఈఈ శ్రీనివాస్, డీఈ సారంగం, రవి కిరణ్, ఏఈలు పాల్గొన్నారు.
పనుల్లో వేగం పెంచండి
నయీంనగర్: కాళోజి కళాక్షేత్ర నిర్మాణ పనుల్లో వేగం పెంచి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, వైస్ చైర్మన్ షేక్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం వారు కాళోజి కళాక్షేత్రాన్ని సందర్శించి పనుల పురోగతి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు పనులు త్వరగా పూర్తి చేయడానికి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కుడా పీఓ అజిత్రెడ్డి, ఈఈ భీంరావు, తదితరులు పాల్గొన్నారు.