
కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు
ఐనవోలు: సూర్యుడు కన్యరాశిలోకి ప్రవేశించిన సందర్భంగా ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం ఉదయం నిత్య కైంకర్యాల అనంత రం కన్యాసంక్రమణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, రుద్రహోమం చేశారు. గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మ సమేత శ్రీమల్లికార్జునస్వామి కల్యాణం శైవాగమోక్తంగా చేపట్టారు. అలాగే ఒగ్గు పూజారులు గర్భాల యం ఎదుట మహా మండపంలో నజరు పట్నం వేసినట్లు ఈఓ అద్దంకి నాగేశ్వర్రావు తెలిపారు. కార్యక్రమంలో ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకుడు ఐనవోలు మధుకర్ శర్మ, వేద పారాయణ దారు గట్టు పురుషోత్తమ శర్మ, భక్తులు పాల్గొన్నారు.