కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రజలకు ఊరట
డీసీసీబీ మాజీ చైర్మన్ రాఘవరెడ్డి
కాజీపేట: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని డీసీసీబీ మాజీ చైర్మన్, జనగామ కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి పిలుపు మేరకు హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా కాజీపేట 62వ డివిజన్ సోమిడిలో ఇంటింటికి కాంగ్రెస్ పేరుతో శుక్రవారం పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. అంతకుముందు సోమిడి బొడ్రాయి, విష్ణుపురిలో శ్వేతార్కమూలగణపతి ఆలయాన్ని దర్శించుకున్నారు.
రాహుల్గాంధీపై వేధింపులు ఆపాలని ఆందోళన
ఏఐసీసీ నాయకుడు రాహుల్గాంధీపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ కాజీపేట చౌరస్తాలో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి రాఘవరెడ్డి ఆందోళన నిర్వహించారు. హైదరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఆయా కార్యక్రమాల్లో కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, విజయశ్రీ, నాయకులు కట్ల శ్రీనివాస్, సయ్యద్ రజాలీ, జక్కుల రమ, బోయిని కుమార్ యాదవ్, గుర్రం కోటేశ్వర్, కట్కూరి రమేస్, శ్రీనివాస్రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, కూర్ల మోహన్ పాల్గొన్నారు.