● ముగ్గురు రాజుల మహోత్సవానికి సిద్ధం ● దేశ, విదేశాల నుంచి రానున్న క్రైస్తవ సోదరులు | - | Sakshi
Sakshi News home page

● ముగ్గురు రాజుల మహోత్సవానికి సిద్ధం ● దేశ, విదేశాల నుంచి రానున్న క్రైస్తవ సోదరులు

Jan 6 2026 7:54 AM | Updated on Jan 6 2026 7:54 AM

● ముగ్గురు రాజుల మహోత్సవానికి సిద్ధం ● దేశ, విదేశాల నుం

● ముగ్గురు రాజుల మహోత్సవానికి సిద్ధం ● దేశ, విదేశాల నుం

● ముగ్గురు రాజుల మహోత్సవానికి సిద్ధం ● దేశ, విదేశాల నుంచి రానున్న క్రైస్తవ సోదరులు

పాటిబండ్లకు ఆధ్యాత్మిక శోభ

పెదకూరపాడు: పాటిబండ్ల గ్రామంలో ఆధ్యాత్మిక శోభ విరజల్లుతుంది. ముగ్గురు రాజుల దేవాలయం తిరునాళ్లకు సిద్ధమైంది. తిరునాళ్ల మహోత్సవాన్ని తిలకించేందుకు దేశ విదేశాలలో ఉన్న మత గురువులు, మతకన్యలు, క్రైస్తవ సోదరులతో రానున్నారు. ఆదర్శవంతమైన సంఘంగా, విశ్వాసానికి ప్రత్యేకంగా పాటిబండ్లలో నిర్మించిన ముగ్గురు రాజుల దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈనెల 1వ తేదీ నుంచి ప్రారంభమైన ఉత్సవాలు 5,6,7 తేదీలతో ముగుస్తాయి. జనవరి ఒకటో తేదీ నుంచి ప్రత్యేక దివ్య పూజ నిర్వహిస్తున్నారు. మంగళవారం నిర్వహించే మహోత్సవంలో గుంటూరు పీఠాధిపతులు చిన్నాబత్తిన భాగ్యయ్య ప్రత్యేక దివ్య పూజ నిర్వహించనున్నారు. మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు స్థానిక విచారణ గురువులు చిన్నాబత్తిన హృదయరాజు తెలిపారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా పెదకూరపాడు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement