రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

Dec 29 2025 8:02 AM | Updated on Dec 29 2025 8:02 AM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

మృతులు ప్రకాశం జిల్లా వాసులు

గుంటూరు రూరల్‌: ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనటంతో ఇరువురు యువకులు ప్రాణాలు కోల్పోయిన సంఘటన గుంటూరు నగరంలోని నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ వంశీధర్‌ తెలిపిన వివరాల ప్రకారం... ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం పరిధిలోని తాళ్లూరు మండలం తూర్పు గంగవరం గ్రామానికి చెందిన చాట్ల నాని (16), చాట్ల అభిషేక్‌ (17)లు ఆదివారం ఉదయం పెదకాకాని సమీపంలోని ఓ ప్రార్థనా మందిరానికి ద్విచక్రవాహనంపై వచ్చారు. అక్కడ ప్రార్థనలు ముగించుకుని తిరిగి సాయంత్రం సమయంలో ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరారు. రూరల్‌ మండలం దాసరిపాలెం సమీపంలో ద్విచక్రవాహనం నేషనల్‌ హైవేపై డివైడర్‌ను ఢీకొంది. తీవ్రగాయాలతో సంఘటనా స్థలంలోనే మృత్యువాతకు గురయ్యారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఽఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతుల వద్దనున్న సెల్‌ఫోన్‌ల ఆధారంగా మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement