ముగిసిన ‘కొలరిడో – నేషనల్ ఫెస్ట్’
గుంటూరు రూరల్: మండలంలోని చౌడవరం గ్రామంలోగల ఆర్వీఆర్జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో గత రెండు రోజులుగా జరుగుతున్న కొలరిడో 2025 నేషనల్ ఫెస్ట్ శనివారంతో ముగిసింది. దేశ నలుమూలల నుంచి వచ్చిన సుమారు 25 వేల మంది విద్యార్థులతో కళాశాల ప్రాంగణం కళకళలాడింది. సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు అలరించారు. టెక్నికల్ విభాగంలో వినూత్న, సృజనాత్మక ఆలోచనలతో ఆకట్టుకున్నారు. కోడింగ్ చాలెంజ్లు, ప్రాజెక్ట్ ప్రదర్శనల్లో ప్రతిభ చాటారు. క్రీడా పోటీలు రసవత్తరంగా సాగాయి. ప్రముఖ హాస్య నటుడు షకలక శంకర్ అందించిన స్క్రిప్ట్ ప్రేక్షకులపై నవ్వుల జల్లు కురిపించింది. అతిథుల చేతుల మీదుగా మొత్తం రూ.5 లక్షల విలువైన నగదు బహుమతులు, మెమెంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు. యువతలోని సృజనాత్మక ఆలోచనలు, సాంకేతిక నైపుణ్యాలే దేశ భవిష్యత్తును నిర్దేశిస్తాయని కళాశాల అధ్యక్షుడు డాక్టర్ ఆర్. శ్రీనివాస్ తెలిపారు. ఉపాధ్యక్షులు జె.మురళీమోహన్, డాక్టర్ ఎం. జగదీష్, కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ ఆర్. గోపాలకృష్ణ, ట్రజరర్ డాక్టర్ కె. కృష్ణప్రసాద్లు మాట్లాడారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.శ్రీనివాస్, డైరెక్టర్ డాక్టర్ కె. రవీంద్ర, ఏవో డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ శ్రీనివాసరావు, కల్చరల్ కమిటీ ఇన్చార్జి కన్వీనర్ రంగరాయచౌదరి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


