తిరుపతమ్మ ఆలయానికి విరాళం | - | Sakshi
Sakshi News home page

తిరుపతమ్మ ఆలయానికి విరాళం

Dec 22 2025 2:14 AM | Updated on Dec 22 2025 2:14 AM

తిరుప

తిరుపతమ్మ ఆలయానికి విరాళం

తిరుపతమ్మ ఆలయానికి విరాళం పెనుగంచిప్రోలు: స్థానిక శ్రీతిరుపతమ్మవారి ఆలయానికి ఆదివారం గుంటూరు జిల్లా, పెద కాకాని మండలం, తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన అత్తోటి సుబ్బారావు, వెంకట పద్మావతి దంపతులు రూ.2లక్షలకు పైగా విరాళాన్ని ఆలయ ఈఓ బి. మహేశ్వరరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి రూ.1,00,116, గోశాలలో గోవుల సంరక్షణకు రూ.1,00,116 విరాళంగా అందజేశారు. దాతలను అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలతో ఆలయ అధికారులు సత్కరించారు. బకింగ్‌హామ్‌ కెనాల్‌లో యువకుడు గల్లంతు 31న హాయ్‌ల్యాండ్‌లో మ్యూజికల్‌నైట్‌ సూర్యారాధనతో ఆరోగ్యం, ఆయుష్షు ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): సూర్యారాధనతో ఆరోగ్యం, ఆయుష్షు, ఐశ్వర్యం సిద్ధిస్తాయని దుర్గగుడి అర్చకులు పేర్కొన్నారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆదివారం సూర్యోపాసన సేవ జరిగింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో రాజగోపురం వద్ద సూర్య భగవానుడి చిత్రపటానికి అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం జరిగిన సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవలో పాల్గొన్న ఉభయదాతలను ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు.

తాడేపల్లి రూరల్‌: మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని వడ్డేశ్వరంలో ఉండే యువకుడు బకింగ్‌హామ్‌ కెనాల్‌లోకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా, గల్లంతైన సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాడేపల్లి ఎస్‌ఐ ఖాజావలి తెలిపిన వివరాల ప్రకారం.. వడ్డేశ్వరానికి చెందిన నాగూర్‌, షంషుద్దీన్‌ల పెద్ద కుమారుడు గఫూర్‌ (25) బీటెక్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతూ ఆరోగ్య సమస్యలతో ఇంటి వద్దనే ఉంటున్నాడు. గ్రామంలోనే ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. మానసిక పరిస్థితి సరిగా లేదు. శనివారం సాయంత్రం వడ్డేశ్వరం నుంచి బకింగ్‌హామ్‌ కెనాల్‌ దాటే బ్రిడ్జిపై ద్విచక్ర వాహనాన్ని పెట్టి కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా, గల్లంతయ్యాడు. అతని ఆచూకీ కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు గాలిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): న్యూ ఇయర్‌ని పరిష్కరించుకుని అమిగోస్‌ ఈవెంట్స్‌ ఆధ్వర్యంలో ఈనెల 31వ తేదీన మంగళగిరి సమీపంలోని హాయ్‌ ల్యాండ్‌లో మ్యూజికల్‌ నైట్‌ జరగనుందని ప్రముఖ సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ తెలిపారు. మ్యూజికల్‌ నైట్‌లో మాస్‌ పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ ఈవెంట్‌లో విజయవాడ గుంటూరు ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. విజయవాడ నగరంలోని ఓ హోటల్‌లో న్యూ ఇయర్‌ వేడుకల పోస్టర్‌ను రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. మ్యూజికల్‌ నైట్‌లో తనతోపాటు మరో 30 మంది సింగర్లు పాల్గొంటారని తెలిపారు. ఆరు వేల మంది పాల్గొనవచ్చని, టికెట్స్‌ బుక్‌ మై షోలో అందుబాటులో ఉన్నాయని వివరించారు.

తిరుపతమ్మ ఆలయానికి విరాళం 1
1/2

తిరుపతమ్మ ఆలయానికి విరాళం

తిరుపతమ్మ ఆలయానికి విరాళం 2
2/2

తిరుపతమ్మ ఆలయానికి విరాళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement