తుఫాన్‌ కారణంగా పలు రైళ్లు రద్దు | - | Sakshi
Sakshi News home page

తుఫాన్‌ కారణంగా పలు రైళ్లు రద్దు

Oct 28 2025 7:58 AM | Updated on Oct 28 2025 7:58 AM

తుఫాన్‌ కారణంగా పలు రైళ్లు రద్దు

తుఫాన్‌ కారణంగా పలు రైళ్లు రద్దు

తుఫాన్‌ కారణంగా పలు రైళ్లు రద్దు ● రైలు నంబర్‌ 07055 సికింద్రాబాద్‌–అనకాపల్లి, ప్రతి గురువారం నవంబర్‌ 6వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ప్రత్యేక రైలు కేటాయించడం జరిగిందని తెలిపారు. ● రైలు నంబర్‌ 07056 అనకాపల్లి–సికింద్రాబాద్‌ రైలు ప్రతి శుక్రవారం నవంబర్‌ 7వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కేటాయించడం జరిగిందని తెలిపారు. ● అదే విధంగా రైలు నంబర్‌ 07033 కాకినాడ టౌన్‌–మైసూర్‌ ప్రతి సోమవారం, శుక్రవారం వారాంతపు ప్రత్యేక రైలు నవంబర్‌ 9వ తేదీ నుంచి 28వ తేదీ వరకు, 07034 మైసూర్‌– కాకినాడ టౌన్‌ రైలు ప్రతి మంగళవారం, శనివారం వారాంతపు రైలు నవంబర్‌ 4వ తేదీ నుంచి 29వ తేదీ వరకు కేటాయించినట్టు తెలిపారు.

లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్‌): దక్షిణ మధ్య రైల్వే గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలో తుఫాన్‌ కారణంగా పలు రైళ్లను రద్దు చేశారని పీఆర్‌ఓ వినయ్‌కాంత్‌ సోమవారం రాత్రి తెలిపారు. రైలు నంబర్‌ 12806 లింగంపల్లి–విశాఖ రైలు, 17281 గుంటూరు–నరసాపూర్‌, 17016 సికింద్రాబాద్‌–భువనేశ్వర్‌, 12704 సికింద్రాబాద్‌ –హౌరా, 17243 గుంటూరు –రాయగడ, రైళ్లు ఈనెల 28వ తేదీన తాత్కాలికంగా రద్దు చేసినట్టు తెలిపారు. రైలు నంబర్‌ 17244 రాయగడ–గుంటూరు రైలు ఈనెల 29వ తేదీన తాత్కాలిక రద్దు చేశారన్నారు.

వారాంతపు ప్రత్యేక రైళ్లు

లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్‌): దక్షిణ మధ్య రైల్వే గుంటూరు డివిజన్‌ పరిధిలో ప్రత్యేక రైళ్లు కేటాయించినట్టు పీఆర్‌ఓ వినయ్‌కాంత్‌ సోమవారం రాత్రి తెలిపారు.

నల్లమడ ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన జేసీ

ప్రత్తిపాడు: మోంథా తుపాను నేపథ్యంలో పెదనందిపాడు మండలంలోని నల్లమడ ముంపు ప్రాంతాన్ని సోమవారం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎ. శ్రీవాస్తవ పరిశీలించారు. నల్లమడ వాగుతో పాటు పరిసరాల్లో ఉన్న నివాసాలను పరిశీలించిన ఆయన స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. నల్లమడ వాగు కట్టపై నివసిస్తున్న ప్రజలను సురక్షితంగా పునరావస కేంద్రాలకు తరలించాలని అదేశించారు. కేంద్రాల్లో నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. తుపాను దృష్ట్యా ఇప్పటికే నల్లమడ వాగు సమీపంలో ఉన్న నలభై కుటుంబాలను పెదనందిపాడులోని ఎస్సీ హాస్టల్‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించడం జరిగిందని అధికారులు జేసికి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement