
డీఆర్ఎం కార్యాలయంలో సోలార్ ప్లాంట్
లక్ష్మీపురం: గుంటూరు రైల్వే డివిజన్ కార్యాలయంలో సోలార్ ప్లాంట్ను ప్రారంభించడం సంతోషదాయకమని డివిజన్ డీఆర్ఎం సుథేష్ఠ సేన్ అన్నారు. గుంటూరు పట్టాభిపురంలోని డీఆర్ఎం కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం సోలార్ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్యాలంలో రోజు వారీ విద్యుత్ వినియోగంలో గణనీయమైన భారాన్ని తీర్చడానికి సోలార్ ప్లాంట్ను రూపొందించడం జరిగిందన్నారు. అనంతరం ప్లాంట్ నిర్మాణం కోసం కృషి చేసిన సంబంధిత అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఏడీఆర్ఎం ఎం.రమేష్కుమార్, డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ ఎం.రవితేజ, సీనియర్ డీసీఎం ప్రదీప్కుమార్, డివిజన్ అధికారులు పాల్గొన్నారు.
ప్రారంభించిన డీఆర్ఎం సుథేష్ఠ సేన్