
పోలీసుల ‘పచ్చ’పాతం
వైఎస్సార్ సీపీ నేతలు నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో టీడీపీ నేతలు కూడా అదే ప్రాంతంలో మరో కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అయితే, వైఎస్సార్ సీపీ నేతలు 9.30గంటలకు నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పోలీసులు టీడీపీ నేతలు వస్తున్నారంటూ వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలను అడ్డుకున్నారు. అంబేడ్కర్ విగ్రహం పక్క సందులో వారిని గంటకు పైగా నిలబెట్టారు. ఆ తర్వాత కూడా పోలీసులు అనుమతినివ్వకపోవడంతో మహిళలు ఇదేమని న్యాయమని ప్రశ్నించారు. మరో 10 నిముషాలు.. మరో 10 నిముషాలు అంటూ కాలయాపన చేస్తుండటంతో చిర్రెత్తుకువచ్చిన వైఎస్సార్ సీపీ నేతలు అడ్డుగా పెట్టిన బ్యారికేడ్లును దాటుకువచ్చి నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు, మహిళా విభాగం నేతలు, పలు అనుబంధ విభాగాల నేతలు పాల్గొన్నారు.