శనివారం శ్రీ 3 శ్రీ మే శ్రీ 2025
9
ప్రసన్నాంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవం
చిలకలూరిపేట: రజక కాలనీలోని ఈశాన్య ప్రసన్నాంజనేయస్వామి దేవాలయ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు.
జూనియర్ సివిల్ జడ్జీలు బాధ్యతల స్వీకారం
గుంటూరులీగల్: గుంటూరు జిల్లాకు బదిలీపై వచ్చిన పలువురు జూనియర్ సివిల్ న్యాయమూర్తులు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో జరిగిన జూనియర్ సివిల్ జడ్జీ ల బదిలీల్లో భాగంగా గుంటూరు జిల్లాకు పలు వురు వచ్చారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తిగా వి.దీప్తి, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తిగా ఎం.జగదీశ్వరి, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తిగా దమ్మాలపాటి ధనురాజ్, నాల్గవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తిగా ఎం.శోభారాణి, ఆరో అదనపు జూనియర్ సివి ల్ జడ్జి కమ్ సీడీ సీఐడీ కోర్టు న్యాయమూర్తిగా మహమ్మద్ గౌస్, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కోర్టు న్యాయమూర్తిగా బి.మేరీ సారా ధనమ్మ బాధ్యతలు స్వీకరించారు.
గిరిజన పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
నరసరావుపేట ఈస్ట్: పల్నాడు రోడ్డులోని గిరిజన సంక్షేమ పాఠశాలలో (బాలురు) 2025–26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి నుంచి 9వ తరగతి (ఇంగ్లిష్ మీడియం) వరకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పాఠశాల ప్రిన్సిపల్ గుమ్మడి వీరయ్య శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తులను ఈనెల 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు స్వీకరిస్తామన్నారు. 5వ తరగతిలో 40 సీట్లు ఉండగా వీటిలో 30 సీట్లు ఎస్టీలకు కేటాయించినట్టు తెలిపారు. మిగిలిన 10 సీట్లలో ఐదు సీట్లు ఎస్సీ, బీసీ 2, ఓసీ 1, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు ఒక సీటు కేటాయించారన్నారు. 6వ తరగతిలో 25, 7వ తరగతిలో 17, 8వ తరగతిలో 24, 9వ తరగతిలో 13 సీట్లు ఉన్నాయని, వాటిని ఎస్టీ సామాజిక వర్గం విద్యార్థులతో భర్తీ చేయనున్నట్టు వివరించారు. 5 నుంచి 9వ తరగతి వరకు మిగులు ఖాళీలను ఎస్టీ విద్యార్థులతోనే భర్తీ చేస్తామన్నారు. ఖాళీల సంఖ్య కన్నా ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వస్తే జిల్లా ట్రైబల్ సంక్షేమశాఖ అధి కారుల సమక్షంలో ఈనెల 30వ తేదీన లాటరీ పద్ధతిలో సీట్లు కేటాయిస్తామని వివరించారు.
మంగళగిరి టౌన్: అమరావతి పునః ప్రారంభ సభ పేరిట రాష్ట్రం నలుమూలల నుంచి తరలించిన ప్రజలకు శుక్రవారం పట్టపగలే చుక్కలు కనిపించాయి. ప్రత్యేక బస్సుల్లో సభా ప్రాంగణానికి చేరుకోవడానికి ఉదయాన్నే వారు బయలు దేరారు. మంగళగిరి ప్రాంతానికి చేరుకునే సరికి మధ్యాహ్నం అయ్యింది. కాజ టోల్గేట్ సమీపంలో దశావతారం దేవాలయం పక్కనే ఉన్న ఖాళీ ప్రాంగణంలో ట్రాన్సిట్ పాయింట్ను అధికారులు ఏర్పాటు చేశారు. భోజనం, అరటిపండ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తాగునీరు ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఇటుగా వచ్చిన రాయలసీమ జిల్లాల వారికి అవి సరిపోక ఇబ్బందులు పడ్డారు. సభా ప్రాంగణానికి వెళ్లేందుకు సరైన సూచికలు కనిపించలేదు. పోలీసులకు, రెవెన్యూ అధికారులకు మధ్య సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. ట్రాన్సిట్ పాయింట్ ముందే కంతేరు అడ్డరోడ్డుకు కొన్ని వాహనాలు తరలించడంతో దూర ప్రాంతాల ప్రజలు భోజనం, తాగునీరు లేక అవస్థలు పడ్డారు. చాలామందికి భోజన సదుపాయం ఇక్కడ కాదని అధికారులు చెప్పడంతో ప్రజలు కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలామంది హోటళ్లను ఆశ్రయించారు.
సభకు వెళ్లకుండానే వెనక్కి...
టోల్గేటు నుంచి చినకాకాని వరకు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వందలకొద్దీ బస్సులు ఒకేసారి టోల్గేటు వద్దకు రావడం, తర్వాత వరుసగా ఆహారం అందించే కేంద్రాల వద్ద ఆగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కొంతమంది కూటమి నేతలు టోల్గేటు వద్దకు వచ్చే బస్సులను ఆపి ఎంతమంది వచ్చారో లెక్కించడంతో ట్రాఫిక్ జామ్కు మరో కారణమైంది. ఉదయం 11 గంటల నుంచి కాజ టోల్గేటు వద్ద ఈ పరిస్థితి కనిపించింది. మధ్యాహ్నం భోజనం చేసి సభా ప్రాంగణానికి బయలుదేరే సరికి ట్రాఫిక్ కొన్ని కిలోమీటర్ల మేర ఆగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం 3 గంటలు దాటినా మంగళగిరి నగరం కూడా దాటకపోవడంతో కార్యక్రమానికి అందుకోలేమని చాలా బస్సుల వారు వెనుదిరిగారు. టాయిలెట్ సౌకర్యం కూడా కల్పించకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గోదావరి, కృష్ణా జిల్లాల బస్సు డ్రైవర్లు కూడా సభా ప్రాంగణానికి వెళ్లలేమని వెనుదిరగనున్నట్లు తెలిపారు. తెనాలి నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరినా మంగళగిరి చేరుకోవడానికి సాయంత్రం 4 గంటలు అయిందని పలువురు మహిళలు పేర్కొన్నారు.
న్యూస్రీల్
ప్రధాని సభకు అరకొరగా ఏర్పాట్లు దూరప్రాంతాల వారికి తప్పని కష్టాలు భోజనం, తాగునీరు దొరక్క అవస్థలు నానా ఇబ్బందులు పడిన మహిళలు గంటల తరబడి ట్రాఫిక్ జాంతో తంటాలు సమన్వయలోపంతో పట్టపగలే చుక్కలు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు