క్రేన్‌ సంస్థలపై ఆదాయ పన్ను శాఖ దాడులు | - | Sakshi
Sakshi News home page

క్రేన్‌ సంస్థలపై ఆదాయ పన్ను శాఖ దాడులు

Mar 19 2025 2:09 AM | Updated on Mar 19 2025 2:10 AM

లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్‌): గుంటూరులో క్రేన్‌ సంస్థలపై ఆదాయ పన్ను శాఖ మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించింది. పొత్తూరు, సంపత్‌నగర్‌ ప్రాంతాలలో ఉన్న ఫ్యాక్టరీలలో అధికారులు సోదాలు చేశారు. గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు చెందిన ఆదాయపన్ను శాఖ అధికారులు మొత్తం 18 మంది ఓ బృందంగా దాడులు నిర్వహించారు. క్రేన్‌ అధినేత ఫ్యాక్టరీలు, బంధువుల ఇళ్లల్లో విస్తృత తనిఖీలు జరిగాయి. తనిఖీల సమయంలో అధికారులు క్రేన్‌ సంస్థల సిబ్బంది సెల్‌ఫోన్లు సీజ్‌ చేశారు. మంగళవారం రాత్రి అంతా తనిఖీలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

18 మంది బృందంతో తనిఖీలు ఫ్యాక్టరీలు, బంధువుల ఇళ్లలో సోదాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement