అమరావతి అభివృద్ధి సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీపార్థసారథి
తాడికొండ: అమరావతి రాజధానికి వెళ్లే సీడ్ యాక్సిస్ రోడ్డుపై పచ్చదనం పెంచాలని అమరావతి అభివృద్ది సంస్థ (ఏడీసీ) చైర్ పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డి.లక్ష్మీ పార్థసారథి అధికారులను ఆదేశించారు. సీడ్ యాక్సిస్ రోడ్డును బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ వేసవి కాలం దృష్ట్యా నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పలు సూచనలు చేశారు. అనంతరం ఎన్–9 రోడ్డుపై బఫర్ జోన్ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రచించాలని ఉద్యాన అధికారులను ఆదేశించారు. పర్యటనలో ఆమె వెంట ఏడీసీ జనరల్ మేనేజర్ కె శ్రీ హరిరావు, చీఫ్ ఇంజినీర్ ఎం ప్రభాకరరావు, ఉద్యాన విభాగాధిపతి విఎస్ ధర్మజ పాల్గొన్నారు.