ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు!

భర్త 2002లో మరణించారు. వట్టిచెరుకూరు వింజనంపాడులో భర్తకు సంబంధించి ఎకరం ఒక సెంట్‌ పొలం ఉంది. తనకు తెలియకుండా తెలిసిన వారు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. దీనిపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో, ఎస్పీ గ్రీవెన్స్‌లో పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. తన సమస్యను పరిష్కారించాలని కోరుతూ మరలా స్పందనలో ఫిర్యాదు చేసేందుకు వచ్చి అస్వస్థతకు గురైంది. దీంతో బాధిత మహిళను చికిత్సకై మహిళా పోలీస్‌ సిబ్బంది 108లో జీజీహెచ్‌కు తరలించారు.

– వడ్లమూడి సీతామహాలక్ష్మీ,

అంగలకుదురు, తెనాలి.

Read latest Guntur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top