
కొల్లేరులోసీఈసీఅధ్యయనం
నేడు కొల్లేరు గ్రామాల్లో కలెక్టర్ పర్యటన
కైకలూరు : కొల్లేరు అభయారణ్య ఆక్రమణలు, పర్యావరణానికి విఘాతం, ప్రజల ఇబ్బందులు, జిరాయితీ, డీఫాం భూముల అంశాలపై సుప్రీంకోర్టులో పిటీషన్ల నేపథ్యంలో ఈనెల 17, 18 తేదీల్లో కేంద్ర సాధికారత కమిటీ (సీఈసీ) పర్యటించనుంది. సీఈసీ కమిటీ సభ్యులు జి.భానుమతి, చంద్ర ప్రకాష్ గోయల్, సునీల్ లిమాయే, డాక్టర్ జైవర్థన్ రమన్లాల్ భట్లు కొల్లేరు ప్రాంతాల్లో అధ్యయనం చేయడానికి విచ్చేస్తున్నారు. సోమ వారం ఢిల్లీ నుంచి రానున్న బృందం ముందుగా విజయవాడలో సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. సీఈసీ పర్యటన నేపథ్యంలో అటవీ శాఖ అ ధికారులు అన్ని దస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతో అప్రమత్తమయ్యారు.
ర్యూట్ మ్యాప్ నిమిత్తం సమావేశం
సీఈసీ పర్యటన నేపథ్యంలో కలెక్టర్ వెట్రిసెల్వి సోమవారం కొల్లేరు ప్రాంతాలను పరిశీలించనున్నారు. సీఈసీకి అందించే నివేదికలపై అటవీ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. కైకలూరు రెవెన్యూ కార్యాలయంలో రూట్ మ్యాప్ నిమిత్తం సమావేశం నిర్వహించనున్నారు. ఈనెల 17న మండవల్లి మండలం, 18న కై కలూరు మండలంలో సీఈసీ సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. కొల్లేరు నాయకులు కై కలూరు మండలం పందిరిపల్లిగూడెం వద్ద బహిరంగ సభ, అలాగే నిడమర్రు మండలం తోకలపల్లి, భైనేపల్లి, ఆకివీడు మండలం సిద్దాపురం ప్రాంతాల్లో కొల్లేరును పరిశీలించాలని అధికారుల ద్వారా సీఈసీకి తెలియజేయడానికి సిద్ధమయ్యారు.
వినతులు సిద్ధం
కొల్లేరులో 122 పరీవాహక గ్రామాలు ఉండగా.. మౌలిక వసతులు, శ్శశానాలకు భూములు, తాగునీటి చెరువులు, మట్టి పూడికలు వంటి అంశాలను సీఈసీకి వినతుల రూపంలో అందించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. కొల్లేరు అభయారణ్యం 77,135 ఎకరాల్లో జిరాయితీ, డీఫాం పట్టా భూములు దాదాపు 20 వేల ఎకరాలు మినహాయించాలనే ప్రధాన డిమాండ్ను సీఈసీ ముందు ఉంచనున్నారు. అటవీ నిబంధనలు కఠినంగా ఉన్నాయని, వాటిని సవరించి ప్రజల అవసరాలకు అనుగుణంగా మార్పు చేయాలని కోరనున్నారు.
కమిటీ సభ్యులు వీరే..
జి.భానుమతి
సీఈసీకి సభ్య సెక్రటరీగా జి.భానుమతి వ్యవహరించనున్నారు. ఆమె త్రిపుర కేడర్కు చెందిన 2009 బ్యాచ్కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి. ప్రస్తుతం న్యూఢిల్లీలో నేషనల్ టైగర్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అథారిటీ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫారెస్ట్గా పనిచేస్తున్నారు.
రమన్లాల్ భట్
డాక్టర్ జైవర్థన్ రమన్లాల్ భట్ అంతర్జాతీయ పర్యావరణ నిపుణులు. 35 ఏళ్లుగా పర్యావరణ శాసీ్త్రయ సాంకేతిక సేవలు అందిస్తున్నారు. పలు సంస్థలకు సలహాదారులుగా ఉన్నారు. పర్యావరణంపై 20 పుస్తకాలు రాశారు. 10 అంతర్జాతీయ సమావేశాలకు సంధానకర్తగా వ్యవహరించారు.
సునీల్ లిమాయే
మహారాష్ట్ర కేడర్కు చెందిన సునీల్ లిమాయే ఇండియన్ ఫారెస్టు సర్వీస్ ఆఫీసర్. చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టుగా పనిచేశారు. ఏకో టూరిజం మేనేజింగ్ డైరెక్టర్, మహారాష్ట్ర సంజయ్ గాంధీ నేషనల్ పార్కు డైరెక్టర్గా ఉన్నారు. చిరుత పులుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.
చంద్రప్రకాష్ గోయల్
చంద్రప్రకాష్ గోయల్ ఐటీ అధికారి. 1986లో ఐఎఫ్ఎస్లో చేరారు. ఉత్తరప్రదేశ్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టుగా పనిచేశారు. కేంద్ర అటవీ, వాతావరణ మార్పుల శాఖ స్పెషల్ సెక్రటరీగా విధులు నిర్వహించారు. పర్యావరణ అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నారు.

కొల్లేరులోసీఈసీఅధ్యయనం

కొల్లేరులోసీఈసీఅధ్యయనం

కొల్లేరులోసీఈసీఅధ్యయనం

కొల్లేరులోసీఈసీఅధ్యయనం