విద్యార్థులకు సమస్యల స్వాగతం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు సమస్యల స్వాగతం

Jun 12 2025 3:19 AM | Updated on Jun 13 2025 5:21 AM

విద్య

విద్యార్థులకు సమస్యల స్వాగతం

యూనిఫాం లేకుండా ఎలా?

విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికే పుస్తకాలు, యూనిఫాం ఇవ్వడం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఈ ఏడాది ఎక్కువ మంది విద్యార్థులకు యూనిఫాం ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉండడం విచారించదగ్గ అంశం. సమయానికి యూనిఫారం, షూ, స్కూల్‌ బ్యాగులు ఇవ్వలేకపోవడం ప్రభుత్వ వైఫల్యంగానే పరిగణించాలి.

– కాకి నాని, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు

విద్యార్థులకు ఇబ్బందులు తప్పవు

ఎస్జీటీల కౌన్సెలింగ్‌ పూర్తికుండా పాఠశాలలు ప్రారంభిస్తే విద్యార్థులు ఇబ్బందులు పడతారు. వారిని నియంత్రించేవారు కరవై ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చెప్పలేం. జిల్లాలో సుమారు 2800 ఎస్జీటీలకు కౌన్సిలింగ్‌ నిర్వహించాల్సి ఉండగా రోజుకు 700 నుంచి 800 మందికి మించి జరిగే పరిస్థితి లేదు. జిల్లాలోనే బదిలీలకు సుమారు 4 రోజులు పట్టొచ్చు.

– గెడ్డం సుధీర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్‌సీపీ టీచర్స్‌ అసోసియేషన్‌

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నూతన విద్యా సంవత్సరం నేటి నుంచి ప్రారంభం కానుంది. అయితే వారికి అసౌకర్యాలు స్వాగతం పలుకనున్నాయి. గతంలో విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అన్ని ఏర్పాట్లూ జరిగిపోయేవి. ఈ ఏడాది అందుకు భిన్నమైన వాతావరణంలో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లనున్నారు. మధ్యలోనే నిలిచిపోయిన నిర్మాణాలు, మరుగుదొడ్లు, ఆహ్లాదకరమైన తరగతి గదులు లేకుండానే తరగతులకు హాజరుకావాల్సిన పరిస్థితి. కనీసం యూనిఫాం, స్కూల్‌ బ్యాగ్‌లు, షూలు ఇవ్వలేని పరిస్థితికి ప్రభుత్వం దిగజారి పోయింది. జిల్లాలో మొత్తం 11,227 పాఠశాలలున్నాయి. ప్రభుత్వ రంగానికి సంబంధించి 2641 ప్రాథమిక పాఠశాలలు, 990 పాథమికోన్నత పాఠశాలలు, 3583 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 1,27,699 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. ప్రభుత్వం పాఠశాలల్లో ఏటా దాదాపు ఆగస్టు, సెప్టెంబర్‌ వరకూ ప్రవేశ అవకాశాలు కల్పించనున్న కారణంగా విద్యార్థుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది.

పూర్తికాని ఉపాధ్యాయుల బదిలీలు

ఉపాధ్యాయుల బదిలీల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అనేక నిబంధనలు అసంబద్ధంగా ఉండడంతో మొన్నటి వరకూ ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ వచ్చాయి. ప్రభుత్వం ఉపాధ్యాయుల డిమాండ్లను పెడచెవిన పెట్టడంతో ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిపి ఐక్య ఉపాధ్యాయ వేదికగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశాయి. చివరకు ప్రభుత్వం దిగొచ్చింది. అప్పటి వరకూ బదిలీలను వెబ్‌ అప్షన్ల ద్వారా నిర్వహించాలని ప్రయత్నించిన ప్రభుత్వం ఉపాధ్యాయుల డిమాండ్లకు తలొగ్గి మాన్యువల్‌ కౌన్సెలింగ్‌కు ఏర్పాటు చేయక తప్పలేదు. ఎస్జీటీల బదిలీల కౌన్సిలింగ్‌ ప్రక్రియ వాస్తవానికి సోమవారమే ప్రారంభించినప్పటికీ మంగళవారం ఏలూరులో నిర్వహించిన కౌన్సిలింగ్‌లో సర్వర్ల సమస్య కారణంగా సోమవారం రాత్రి 11 గంటల వరకూ కూడా ప్రారంభం కాలేదు. దీంతో ఈ కౌన్సిలింగ్‌ను మంగళవారానికి వాయిదా వేసి బుధవారం ఉదయం నుంచి కొనసాగించారు. బుధవారం మొత్తం రోజంతా మున్సిపల్‌ ఉపాధ్యాయుల బదిలీల కౌన్సిలింగ్‌తోనే సరిపోయింది. ఇతర యాజమాన్యాల్లోని పాఠశాలలకు చెందిన సుమారు 2800 మంది ఎస్జీటీల బదిలీలకు సంబంధించి కౌన్సిలింగ్‌ గురువారం చేపట్టనున్నారు.

పూర్తిగా రాని బ్యాగ్‌లు, షూలు, యూనిఫాం

గత ప్రభుత్వ హయాంలో విద్యా సంవత్సరం ప్రారంభమైన రోజునే జగనన్న విద్యాకానుక కిట్లను విద్యార్థులకు అందించేవారు. పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, డిక్షనరీలతో పాటు ముఖ్యంగా స్కూల్‌ యూనిఫారం, షూలు, స్కూలు బ్యాగులు అందించే ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సమయానికి యూనిఫాం ఇచ్చే పరిస్థితి లేదు. ఇంతవరకూ కేవలం 85675 బ్యాగులు మాత్రమే వచ్చాయి. షూలు 59,080 మాత్రమే వచ్చాయి. స్కూల్‌ యూనిఫారం విషయానికి వస్తే జిల్లాకు ఇంతవరకూ 80,637 జతల యూనిఫాం మాత్రమే వచ్చింది.

ఉపాధ్యాయులు లేకుండా తరగతులు ఎలా ?

ఒకపక్క ఉపాధ్యాయుల బదిలీల కౌన్సిలింగ్‌ జరుగుతుండగానే తరగతులు ప్రారంభించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఉపాధ్యాయులు లేకుండా పాఠశాలలు ప్రారంభించి ఏం లాభమని ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీస్తున్నారు. కౌన్సెలింగ్‌ పూర్తయిన తరువాత పాఠశాలలను ప్రాంభించే ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

నేటి నుంచే పాఠశాలల పునఃప్రారంభం

ఇప్పటికీ పూర్తికాని ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్‌

పూర్తిగా రాని బ్యాగ్‌లు, షూలు, యూనిఫాం

విద్యార్థులకు సమస్యల స్వాగతం 1
1/3

విద్యార్థులకు సమస్యల స్వాగతం

విద్యార్థులకు సమస్యల స్వాగతం 2
2/3

విద్యార్థులకు సమస్యల స్వాగతం

విద్యార్థులకు సమస్యల స్వాగతం 3
3/3

విద్యార్థులకు సమస్యల స్వాగతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement