పైప్‌లైన్‌ లీకేజీకి పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

పైప్‌లైన్‌ లీకేజీకి పరిష్కారం

Jun 12 2025 3:19 AM | Updated on Jun 13 2025 5:21 AM

పైప్‌

పైప్‌లైన్‌ లీకేజీకి పరిష్కారం

కై కలూరు: వాహనదారులు, ప్రజలకు ఇబ్బందికరంగా మారిన బైపాస్‌ రోడ్డు మలుపు వద్ద ఏర్పడిన పైప్‌లైన్‌ లీకేజీ సమస్యను పంచాయతీ అధికారులు పరిష్కరించారు. దీని కారణంగా రోడ్డుపై ఏర్పడిన భారీ గుంతతో ప్రమాదాలు అనే శీర్షికతో సాక్షిలో కథనం బుధవారం వెలువడిన విషయం పాఠకులకు విధితమే. దీనిపై పంచాయతీ ఈవో ప్రత్తిపాటి ఆనంద భూషణం తక్షణం స్పందించారు. పంచాయతీ సిబ్బంది పొక్లయిన్‌ ఉపయోగించి పైపులైన్లకు మరమ్మత్తులు చేయించారు.

డీఎస్సీ పరీక్షలకు 566 మంది హాజరు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలోని వివిధ పరీక్షా కేంద్రాల్లో బుధవారం నిర్వహించిన డీఎస్సీ పరీక్షకు మెత్తం 566 మంది హాజరయ్యారు. సిద్ధార్థ క్వెస్ట్‌ కేంద్రంలో ఉదయం పరీక్షకు 180 మందికి 177 మంది, సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఉదయం 200 మందికి 197 మంది, మధ్యాహ్నం 200 మందికి గాను 192 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగలేదని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు.

పుస్తకాల పేరిట వ్యాపారం

ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ఏలూరు జిల్లా పెదపాడు మండలం హనుమాన్‌ జంక్షన్‌ చైతన్య స్కూల్లో పుస్తకాలు అమ్మకాలు జరుగుతున్నాయని.. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కొలిక్కపోగు లెనిన్‌ అన్నారు. చదువు పేరుని అడ్డుపెట్టుకుని తల్లిదండ్రులపై భారం మోపి దోచుకుంటున్నారని తెలుగు రాష్ట్రాల్లో పుస్తకాల పేరుతోనే కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారన్నారు. కార్పొరేట్‌ విద్యాసంస్థలకు విద్యాశాఖ అధికారులు కొమ్ము కాస్తున్నారని.. విద్యాసంస్థల్లో వసతులు లేకుండా అన్ని ఉన్నాయని.. తమ స్కూలు గొప్పదని తల్లిదండ్రులను మోసం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు మనోజ్‌ మహర్షి పాల్గొన్నారు.

గ్రామ సర్పంచ్‌పై వివక్ష

దెందులూరు: గ్రామ సర్పంచ్‌గా ఉన్న తనకు 8 నెలలుగా సచివాలయంలో కుర్చీ తీసివేశారని, తన గదిలో ఉన్న సర్పంచ్‌ బోర్డును కూడా తొలగించారని గోపన్నపాలెం సర్పంచ్‌ కే.నాగమల్లేశ్వరి అన్నా రు. బుధవారం గోపన్నపాలెం సచివాలయంలో విలేకరులకు తొలగించిన కుర్చీ, నేమ్‌బోర్డు చూపించారు. గ్రామ కార్యదర్శికి ఫోన్‌ చేస్తే తీయడం లేదని, సమాధానం ఇవ్వడం లేదని, తాను పంచాయతీలో పనులు చేసిన బిల్లులు కూడా ఇవ్వడం లేదన్నారు. ఈ విషయంపై డీపీఓ, మహిళా కమిషన్‌, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానన్నారు. నెల క్రితం సర్పంచ్‌ కుర్చీ తీసిన సంగతి వాస్తవమేనని కార్యదర్శి స్టానిష్‌బాబు అన్నారు. కుర్చీ రిపేరు నిమిత్తం తీశామని చెప్పారు.

విద్యుత్‌ అధికారుల బదిలీలు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): తూర్పుప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ ఏలూరు, పశ్చిమ గోదావరి సర్కిళ్ల పరిధిలో పలువురు విద్యుత్‌ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా స్టోర్స్‌లో ఏఈఈ అవుట్‌ డోర్‌గా పని చేస్తున్న మురళీకృష్ణను జంగారెడ్డిగూడెం ఆపరేషన్స్‌ ఏఈఈగా బదిలీ చేశారు. పెదవేగి డిప్యూటీ ఈఈ ఆపరేషన్స్‌గా పని చేస్తున్న బీవీ కృష్ణ రాజాను రాజోలు ఆపరేషన్స్‌ డిప్యూటీ ఈఈగా బదిలీ చేశారు. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ సర్కిల్‌ కార్యాలయంలో డిప్యూటీ ఈఈగా పని చేస్తున్న ఐవీ మల్లేశ్వరరావును పెదవేగి, రంపచోడవరం రూరల్‌ ఆపరేషన్స్‌ డిప్యూటీ ఈఈ దివాకరరావును తణుకు బదిలీ చేశారు.

పైప్‌లైన్‌ లీకేజీకి పరిష్కారం 
1
1/3

పైప్‌లైన్‌ లీకేజీకి పరిష్కారం

పైప్‌లైన్‌ లీకేజీకి పరిష్కారం 
2
2/3

పైప్‌లైన్‌ లీకేజీకి పరిష్కారం

పైప్‌లైన్‌ లీకేజీకి పరిష్కారం 
3
3/3

పైప్‌లైన్‌ లీకేజీకి పరిష్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement