మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ సిబ్బంది నిరసన | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ సిబ్బంది నిరసన

Jun 14 2025 7:31 AM | Updated on Jun 14 2025 7:31 AM

మున్స

మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ సిబ్బంది నిరసన

నరసాపురం/తణుకు అర్బన్‌: ఏపీ మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటి జేఏసీ పిలుపులో మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ సెక్షన్‌లో కాంట్రాక్ట్‌ పద్ధతిపై పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం మున్సిపల్‌ కార్యాలయం వద్ద వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేవారు. మోకాళ్లపై నిల్చుని ఆందోళన చేశారు. రెగ్యులరైజ్‌ చేయాలని, హెచ్‌ఆర్‌సీ పాలసీ అమలు చేయాలని, సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో తణుకు మున్సిపల్‌ కార్మికులు ధర్నా నిర్వహించారు. సమాన పనికి సమాన వేతనం అందించాలని డిమాండ్‌ చేస్తూ మునిసిపల్‌ మోకాళ్లపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షుడు శ్రీను మాట్లాడుతూ జీవో 36ను అవుట్‌సోర్సింగ్‌ కార్మికులకు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీల్లో నగర అభివృద్ధి కోసం గుత్తేదారులకు చెల్లిస్తున్న ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్లను అవుట్‌సోర్సింగ్‌ కార్మికులకు కూడా అమలుచేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలన్నారు. చనిపోయిన, రిటైర్‌ అయిన కార్మికుల వారసులకు ఉపాధి కల్పించాలని, ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జేఏసీ గౌరవ అధ్యక్షుడు పాపారావు, విజయ్‌కుమార్‌, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ సిబ్బంది నిరసన 1
1/1

మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ సిబ్బంది నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement