సంక్షేమానికి తూట్లు.. సంక్షోభం నిండేట్లు | - | Sakshi
Sakshi News home page

సంక్షేమానికి తూట్లు.. సంక్షోభం నిండేట్లు

Jun 10 2025 7:12 AM | Updated on Jun 10 2025 7:26 AM

రేపు క్యాంపస్‌ డ్రైవ్‌
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు ప్రభుత్వ ఐటీఐ, ఇండస్ట్రీయల్‌ ఎస్టేట్‌లో ఈనెల 11న క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నారు. 08812–230269లో సంప్రదించవచ్చు.

మంగళవారం శ్రీ 10 శ్రీ జూన్‌ శ్రీ 2025

నాడు..

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంక్షేమమే పరమావధిగా పాలన సాగించారు.. పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టారు.. ఇంటి ముంగిళ్లలోకే సర్కారీ సేవలను అందించి పాలనలో కొత్త ఒరవడిని సృష్టించారు. విద్య, వైద్యరంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు.. మహిళా సాధికారత లక్ష్యంగా పథకాలు అందించారు.. అన్నదాతలకు స్థానికంగా సేవలందించేలా రైతు భరోసాకేంద్రాలు ఏర్పాటుచేశారు. గిరిపుత్రులకునేనున్నానంటూ.. ఆరోగ్య భరోసా కల్పించారు. నాటి పాలనలో సంక్షేమం, సుభిక్షం పరవళ్లు తొక్కాయి.

ఏలూరు టౌన్‌: కూటమి ప్రభుత్వం రైతుల నడ్డి విరిచింది. ఏడాది పాలనలో పెట్టుబడి సాయం ఒక్క రూపాయి ఇవ్వకపోగా.. పంటలకు గిట్టుబాటు ధరలు కూడా కల్పించలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జిల్లాలో 2,35,847 మంది రైతులకు రైతు భరోసా కింద రూ.1,839.24 కోట్ల లబ్ధి చేకూర్చారారు. అలాగే 97,584 మంది రైతులకు సున్నా వడ్డీ పంట రుణాల కింద రూ.97.29 కోట్లు అందించారు. ఉచిత విద్యుత్‌ కింద 70,960 సర్వీసులకు రూ.2467.25 కోట్లు ఖర్చు చేశారు. రూ.60.94 కోట్లతో సుమారు 228 రైతు భరోసా కేంద్రాలు నిర్మించి రైతులకు సేవలందించారు. అయితే కూటమి ప్రభుత్వంలో ఈ కేంద్రాలు నిరుపయోగంగా మారుతున్నాయి.

గ్రామీణ వైద్యంలో విప్లవం

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఫ్యామిలీ డాక్టర్‌ విధానం ద్వారా ఇంటికే వైద్య సేవలందించారు. కూటమి ప్రభుత్వంలో ఈ విధానం అమలు కావడం లేదు. రూ.39.86 కోట్లతో 178 హెల్త్‌ క్లినిక్స్‌ నిర్మాణం చేపట్టి పల్లెల్లో మెరుగైన వైద్య సేవలందించారు.

విద్యారంగం.. మహోన్నతం

గత ప్రభుత్వంలో విద్యారంగంలో సంస్కరణకు మాజీ సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారు. జిల్లాలో 2,032 బడులను నాడు–నేడు పథకంలో రూ.270.75 కోట్లతో ఆధునికీకరించారు. ఇంగ్లిష్‌ మీడియం, డిజిటల్‌ బోధనలు అమలులోకి తెచ్చారు. నేడు కూటమి సర్కారులో నాడు–నేడు పథకాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

రేషన్‌ వాహనాల రద్దు : జిల్లాలో ప్రతి కుటుంబానికీ తమ ఇంటి సమీపంలోనే రేషన్‌ అందించేలా 395 వాహనాలను జిల్లాలోని 1,123 రేషన్‌ షాపులకు గత ప్రభుత్వం అనుసంధానం చేసింది. అలాగే వాహనంలో ఇద్దరికి చొప్పున ఉపాధి కల్పించింది. ఇలా జిల్లాలోని 6,31,044 కార్డుదారులకు ప్రతి నెలా 8,791.03 టన్నుల బియ్యం, 218.75 టన్నుల పంచదార, కందిపప్పు, గోధుమ పిండి, ఆయిల్‌ ప్యాకెట్లను పంపిణీ చేసింది. అయితే కూటమి ప్రభుత్వం రేషన్‌ వాహనాలను రద్దు చేసి ప్రజలకు ఇంటి వద్దనే రేషన్‌ అందుకునే సౌకర్యాన్ని దూరం చేసింది.

అందరికీ ‘గృహ’యోగం

గత ప్రభుత్వంలో జిల్లాలో 1,16,431 మందికి ఇళ్ల పట్టాలను ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయించి అందించింది. 98,874 ఇళ్ల నిర్మాణాల కోసం రూ.713.17 కోట్లు ఖర్చు చేశారు. జిల్లాలో 654 మంది రైతులకు 524.116 ఎకరాల భూమి పంపిణీ చేశారు. 2003 నుంచి 22(ఎ)లో ఉన్న 11715.32 ఎకరాల భూమికి విముక్తి కల్పించి 9,172 మందికి మేలు కలిగించారు. నిషేధిత జాబితాలో ఉన్న 391.45 ఎకరాల భూమిని అర్హులైన 611 మందికి ఎస్సీ లబ్ధిదారులకు అందించారు. 26 గ్రామాల్లో 27.31 ఎకరాల భూమిని ఎస్సీ శ్మశాన వాటికలకు కేటాయించారు.

ఏలూరులో వైద్య కళాశాల

దశాబ్దాల కలగా ఉన్న ఏలూరులో ప్రభుత్వ వైద్య కళాశాలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సాకారం చేసింది. రూ.525 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో మెడికల్‌ కాలేజీ నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం రెండేళ్లకు గానూ 300 మంది వైద్య విద్య అభ్యసిస్తున్నారు. మొదటి ఏడాది 150 మందితో ఎంబీబీఎస్‌ తరగతులు 2023 సెప్టెంబర్‌ 2న ప్రారంభిస్తే, రెండో ఏడాది 2024 సెప్టెంబర్‌లో మరో 150 మంది మెడిసిన్‌లో చేరారు.

గిరిపుత్రుల కోసం.. జిల్లాలోని ఏజెన్సీ, మెట్ట ప్రాంతాల్లో మెరుగైన వైద్యసేవలందించేలా గత ప్రభుత్వంలో చింతలపూడిలో 100 పడకల ఆస్పత్రి, బుట్టాయగూడెంలో రూ.55 కోట్ల వ్యయంతో 150 పడకల మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. నూజివీడులో రూ.25 కోట్లతో ఆస్పత్రి సమగ్ర అభివృద్ధికి చర్యలు చేపట్టారు.

సప్త ప్రదక్షిణలు ప్రారంభం

పాలకొల్లు సెంట్రల్‌: పంచారామక్షేత్రం పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో సప్త సోమవారాల ప్రదక్షిణలు ప్రారంభించినట్టు ఈఓ శ్రీనివాసరావు తెలిపారు.

నేడు

టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏడాది పాలనలో సం‘క్షామం’, సంక్షోభంతో ప్రజలు అల్లాడుతున్నారు. విద్య, వైద్యరంగాలు పూర్తిగా నిర్వీర్యం కాగా.. ప్రజలకు ప్రభుత్వ సేవలు దూరమవుతున్నాయి. సూపర్‌ సిక్స్‌ హామీల అమలును గాలికొదిలేస్తూ సంక్షేమాన్ని దూరం చేస్తున్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారు. పథకాలు అమలు చేయకుండా మొండిచేయి చూపడంతో మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు భవితవ్యం అయోమయంగా మారింది. ఇలా ప్రజా జీవనాన్ని ఏడాది పాలనలో అస్తవ్యస్తం చేసిన ఘనత కూటమి సర్కారుకే దక్కుతుంది.

న్యూస్‌రీల్‌

కూటమి కక్ష

సంక్షేమ, అభివృద్ధి పథకాల్లేవు

ఎండీయూ వాహనాలు రద్దు

విద్య, వైద్య రంగాలు నిర్వీర్యం

సచివాలయ వ్యవస్థపై శీతకన్ను

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గ్రామ స్వరాజ్యమే లక్ష్యం

సచివాలయాల్లో 543 సేవలు

ఇంటింటా సంక్షేమ పరవళ్లు

కూటమికి గుణపాఠం తప్పదు

కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు, దౌర్జ న్యాలు, అక్రమ కేసులు, జైళ్లకు పంపటంలో బిజీగా ఉంది. సూపర్‌సిక్స్‌ హామీలు అమలుకు నోచుకోలేదు. మహిళలను ఘోరంగా మోసం చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుంది. ప్రభుత్వానికి చెప్పుకోవటానికి ఏమీ లేకపోవటంతో ప్రజలు నిలదీస్తారనే భయంతో దౌర్జన్యాలు చేస్తూ అణచివేసే ప్రయత్నాలు చేస్తున్నారు. భవిష్యత్తులో టీడీపీ కూటమికి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

– దూలం నాగేశ్వరరావు,

వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు

ఉద్యోగాలు పీకేస్తున్నారు

ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికిన కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో 3 లక్షల ఉద్యోగులను తొలగించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఇవ్వడం లేదు. పేద పిల్లలను చదువులకు దూరం చేస్తున్నారు. నిరుద్యోగ భృతి మాటెత్తడం లేదు. ప్రభుత్వ చర్యలు రైతుల నడ్డివిరిచేలా ఉన్నాయి. సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. వైద్య రంగాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. కూట మి ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.

– మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు,

నూజివీడు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త

గత ప్రభుత్వంలో గ్రామ స్వరాజ్యానికి బాటలు

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా వలంటీర్‌, సచివాలయ వ్యవస్థలు ఏర్పాటుచేశారు. జిల్లాలో 605 సచివాలయాల్లో 4,701 మంది ఉద్యోగులను నియమించి ప్రజలకు సేవలందించారు. 443 సచివాలయ భవనాల నిర్మాణాలను రూ.193.15 కోట్లతో మొదలుపెట్టి 284 భవనాలను రూ.120.18 కోట్లతో పూర్తిచేశారు. వలంటీర్ల ద్వారా పౌర సేవలు ఇంటి వద్దకే అందించారు. అయితే ప్రస్తుత కూటమి సర్కారులో ప్రజలు, విద్యార్థులు, యువత సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. జేబులు నింపితే కానీ సర్టిఫికెట్‌ చేతికి రావడం లేదని పలువురు గగ్గోలు పెడుతున్నారు.

సంక్షేమానికి తూట్లు.. సంక్షోభం నిండేట్లు 1
1/6

సంక్షేమానికి తూట్లు.. సంక్షోభం నిండేట్లు

సంక్షేమానికి తూట్లు.. సంక్షోభం నిండేట్లు 2
2/6

సంక్షేమానికి తూట్లు.. సంక్షోభం నిండేట్లు

సంక్షేమానికి తూట్లు.. సంక్షోభం నిండేట్లు 3
3/6

సంక్షేమానికి తూట్లు.. సంక్షోభం నిండేట్లు

సంక్షేమానికి తూట్లు.. సంక్షోభం నిండేట్లు 4
4/6

సంక్షేమానికి తూట్లు.. సంక్షోభం నిండేట్లు

సంక్షేమానికి తూట్లు.. సంక్షోభం నిండేట్లు 5
5/6

సంక్షేమానికి తూట్లు.. సంక్షోభం నిండేట్లు

సంక్షేమానికి తూట్లు.. సంక్షోభం నిండేట్లు 6
6/6

సంక్షేమానికి తూట్లు.. సంక్షోభం నిండేట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement