ఆయిల్‌పామ్‌ రైతుల ఆక్రందన | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌పామ్‌ రైతుల ఆక్రందన

Jun 10 2025 7:12 AM | Updated on Jun 10 2025 7:12 AM

ఆయిల్‌పామ్‌ రైతుల ఆక్రందన

ఆయిల్‌పామ్‌ రైతుల ఆక్రందన

ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): పామాయిల్‌ దిగుమతి సుంకం 50 శాతానికి పెంచాలని, ఆయిల్‌పామ్‌ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్‌ ఆయిల్‌పామ్‌ రైతుల సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం ఏలూరు కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ముడి పా మాయిల్‌పై దిగుమతి సుంకాన్ని తగ్గించడంతో ఆ యిల్‌పామ్‌ గెలల ధరలు తగ్గి రైతులు నష్టపోతున్నారన్నారు. దేశంలోనే అత్యధిక ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణం ఆంధ్రప్రదేశ్‌లో, రాష్ట్రంలోనే అధిక సాగు ఏలూరు జిల్లాలో ఉందని, రాష్ట్రంలో రైతులు, కూలీలు, కార్మికులు 10 లక్షలకు పైగా కుటుంబాలు ఆయిల్‌పామ్‌పై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. కోకో రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు, జిల్లా సహాయ కార్యదర్శి సిరిబత్తుల సీతారామయ్య, ఆయిల్‌పామ్‌ రైతుల సంఘం నాయకులు గంటా పాపారావు, దాసరి జానకిరామరెడ్డి మాట్లా డుతూ తెలంగాణలో ఆయిల్‌ఫెడ్‌ కొత్త ఫ్యాక్టరీలు నిర్మాణం చేస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం ఆయిల్‌ ఫెడ్‌ కర్మాగారం అభివృద్ధి జరగలేదన్నారు. ఫలితంగా ఆయిల్‌ రికవరీ శాతం (ఓఈఆర్‌) తక్కువగా చూపడంతో రైతులు నష్టపోతున్నారని చెప్పారు. అనంతరం డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement