‘సాక్షి’ కార్యాలయాలపై దాడులు అమానుషం | - | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ కార్యాలయాలపై దాడులు అమానుషం

Jun 10 2025 7:12 AM | Updated on Jun 10 2025 7:12 AM

‘సాక్

‘సాక్షి’ కార్యాలయాలపై దాడులు అమానుషం

గళమెత్తిన ఉద్యోగులు

పెంటపాడు: రాష్ట్రంలోని ‘సాక్షి’ కార్యాలయాలపై తెలుగుదేశం పార్టీ శ్రేణుల కుట్రపూరిత దాడులను ఖండిస్తూ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం యూనిట్‌ ఉద్యోగులు గళమెత్తారు. సాక్షి మీడియాపై భౌతిక దాడులకు నిరసనగా పెంటపాడు మండలం ప్రత్తిపాడులోని సాక్షి యూనిట్‌ కార్యాలయం వద్ద సోమ వారం రాత్రి ఉద్యోగులు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ‘సాక్షి’పై కుట్రపూరిత, అక్రమ దాడులను ఖండించాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని పెద్ద ఎత్తున నినదించారు. ఉద్యోగులు పాల్గొన్నారు.

పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు

‘సాక్షి’ కార్యాలయాలపై దాడిని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని జర్నలిస్ట్‌ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. దాడులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీడబ్ల్యూజే జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఏలూరులో డీఎస్పీ డి. శ్రావణ్‌కుమార్‌కు, భీమవరంలో సీఐ నాగరాజుకు జర్నలిస్ట్‌ సంఘాల నాయకులు ఫిర్యాదులు అందజేశారు. దాడులకు తెగబడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నూజివీడులో సీఐ సత్యశ్రీనివాస్‌ కు, నరసాపురంలో ఎస్సై జయలక్ష్మికి, జంగారెడ్డిగూ డెం స్టేషన్‌లో ఎస్సై జబీర్‌కి, తాడేపల్లిగూడెం స్టేషన్‌లోనూ మీడియా ప్రతినిధులు ఫిర్యాదులు చేశారు.

ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన

ఏలూరు టౌన్‌: ఏలూరు ‘సాక్షి’ కార్యాలయంపై టీ డీపీ కూటమి నేతలు దాడులపై ఏపీయూడబ్ల్యూజే ఏలూరు జిల్లా కమిటీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్‌కు వినతిపత్రం నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ టీవీ జిల్లా ప్రతినిధి పోతురాజు మాట్లాడుతూ మీడియా కార్యాలయాలపై దాడు లకు పాల్పడటం సరికాదన్నారు. ఏపీయూడబ్ల్యూ జే జిల్లా ప్రధాన కార్యదర్శి బీకే కిషోర్‌ మాట్లాడు తూ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం కల్పించిన వాక్‌ స్వాతంత్య్రాన్ని హరించేలా కూటమి ప్ర భుత్వం సీనియర్‌ జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించటాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలని, ఇదే తరహాలో అక్రమ కేసులు, దాడులు చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు ఉర్ల శ్రీనివాస్‌ మాట్లాడుతూ ‘సాక్షి’ టీవీ డిబేట్‌లో ఒక అంశానికి సంబంధించి దొర్లిన తప్పునకు జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాస్‌, కృష్ణంరాజు బహిరంగ క్షమాపణలు చెప్పినా ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం సరి కాదన్నారు. దీనిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారని చెబుతున్నారని, ఇలాంటి చర్యలతో జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేయటాన్ని తప్పుబడుతున్నామని చెప్పా రు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్‌ మీడియా జిల్లా అధ్యక్షుడు ఎస్‌.సంజయ్‌కుమార్‌, జిల్లా ఉపాధ్యక్షులు వి.మధుసూర్యప్రకాష్‌, సీహెచ్‌ రామకృష్ణరాజు, ఫొటో జర్నలిస్ట్స్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌కే రియాజ్‌, సీనియర్‌ జర్నలిస్టులు గుండిమెడ రామచంద్రశర్మ, కర్రి అప్పలరాజు, వంశీధర్‌, ఎం.రాజేష్‌కుమార్‌, బి.భరత్‌కుమార్‌, గంజి చంటి, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

‘సాక్షి’ కార్యాలయాలపై దాడులు అమానుషం 1
1/1

‘సాక్షి’ కార్యాలయాలపై దాడులు అమానుషం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement