ఉద్యాన వర్సిటీతో శశి ఒప్పందం | - | Sakshi
Sakshi News home page

ఉద్యాన వర్సిటీతో శశి ఒప్పందం

Jun 10 2025 6:57 AM | Updated on Jun 10 2025 6:57 AM

ఉద్యా

ఉద్యాన వర్సిటీతో శశి ఒప్పందం

తాడేపల్లిగూడెం: విద్య, పరిశోధన, శిక్షణ రంగాల్లో పరస్పర సహకారానికి సంబంధించి డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీ, శశి ఇంజనీరింగ్‌ కళాశాల మధ్య సోమవారం ఎంఓయు కుదిరింది. విద్యార్థులకు పరిశోధన అవకాశాలు, పరిశ్రమ ఆధారిత శిక్షణ, ఇంటర్న్‌షిప్‌, జాయింట్‌ ప్రాజెక్టుల ద్వారా ప్రయోజనం పొందే అవకాశాలు ఈ ఎంఓయు ద్వారా కలగనుంది. విద్యారంగ అభివృద్ధి, నూతన ఆవిష్కరణలు, వ్యవసాయ, ఉద్యాన సాంకేతికల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. రెండు సంస్థల అభివృద్ధికి ఈ ఒప్పందం తోడ్పాటుగా నిలవనుందని ఉద్యాన వర్సిటీ వీసీ కె.గోపాల్‌, శశి వైస్‌చైర్మన్‌ మేకా నరేంద్రకృష్ణలు అన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్‌ కె.గోపాల్‌, డైరెక్టర్‌ ప్రోగ్రామ్స్‌ కె.ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి సేవలో ‘కేజీఎఫ్‌’ నటుడు

ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయాన్ని కేజీఎఫ్‌ సినిమాలో విలన్‌గా నటించిన రామచంద్రరాజు (గరుడారామ్‌) సోమవారం సాయంత్రం సందర్శించారు. భార్య సుమ, సినీ దర్శకుడు సాయి శివాన్‌ జంపానతో కలసి ఆలయానికి విచ్చేసిన ఆయన ముందుగా స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గరుడారామ్‌ మాట్లాడుతూ ప్రస్తుతం వైరం చిత్రంలో మెయిన్‌ విలన్‌గా నటిస్తున్నట్టు చెప్పారు. ఆ చిత్రం వచ్చేనెలలో రిలీజ్‌ అవుతుందని తెలిపారు. దర్శకుడు సాయి శివాన్‌ మాట్లాడుతూ వచ్చేనెల మొదటి వారంలో పూరీ జగన్నాఽథ్‌ సోదరుడు సాయిరామ్‌ శంకర్‌ హీరోగా తెరకెక్కనున్న ఇంటికో సైకో చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించనున్నట్టు తెలిపారు.

ఉద్యాన వర్సిటీతో శశి ఒప్పందం 1
1/1

ఉద్యాన వర్సిటీతో శశి ఒప్పందం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement