
జైలు నిర్మాణ పనులను పరిశీలించిన డీఐజీ
కై కలూరు: కై కలూరులో నిర్మిస్తున్న జైలు, పెట్రోల్ బ్యాంకు నిర్మాణ పనులను జైళ్ల శాఖ డీఐజీ ఎం.వరప్రసాద్ సోమవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ మానవ హక్కుల సంస్థల సూచనలతో ఖైదీలకు అన్ని సౌకర్యాలతో నూతన నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. దాదాపు 60 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. గతంలో కొందరు ఖైదీలు స్నానాల గదుల్లో పైన ఊచలకు ఉరి వేసుకుని ఆత్మహత్యలు చేసుకునేవారన్నారు. అలాంటి సమస్యలు లేకుండా స్నానాల గదుల ఎత్తు తగ్గించి, పైన ఓపెన్గా ఉంచుతామన్నారు. పెట్రోలు బ్యాంకు వచ్చే నెలలో ప్రారంభిస్తామని చెప్పారు. కార్యక్రమంలో విజయవాడ డీఎస్జేవో ఆఫీస్ జైలర్ వి.ఉమామహేశ్వరరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
గ్రామ ఉత్కర్ష అభయాన్ అమలుపై సమీక్ష
ఏలూరు(మెట్రో): జిల్లాలో జాతీయ గ్రామ ఉత్కర్ష అభయానన్ పథకం పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో పథకం అమలుపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంపై గిరిజనులకు అవగాహన కల్పించేందుకు జూన్న్ 15 నుంచి 30 వరకు జిల్లాలో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. సమావేశంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాములు నాయక్, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.

జైలు నిర్మాణ పనులను పరిశీలించిన డీఐజీ