ఏడాది నిండా.. దౌర్జన్యకాండ | - | Sakshi
Sakshi News home page

ఏడాది నిండా.. దౌర్జన్యకాండ

Jun 9 2025 7:05 AM | Updated on Jun 9 2025 7:05 AM

ఏడాది

ఏడాది నిండా.. దౌర్జన్యకాండ

సాక్షి ప్రతినిధి,ఏలూరు : జిల్లాలో దాడుల సంస్కృతి తారాస్థాయికి చేరింది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలు ప్రశాంతతకు మారుపేరు. సాధారణంగా ఎన్నికల సమయంలో మాత్రమే ఇక్కడ రాజకీయాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే గత ఏడాది కాలంలో జిల్లాలో పూర్తి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రజాప్రతినిధులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం, పల్లెల్లో కూటమి నేతలు అడ్డూఅదుపు లేకుండా రెచ్చిపోవడం నిత్యకృత్యంగా కొనసాగింది. ప్రధానంగా దెందులూరు, చింతలపూడి, నూజివీడు, కైకలూరు, పోలవరం నియోజకవర్గాల్లో దా డులు, హత్యాయత్నాలు, హత్యలు వరకు పలు ఘ టనలు నమోదయ్యాయి. తొలిసారిగా జిల్లాలో జర్నలిస్టులు, పత్రికా కార్యాలయాలపై దాడుల సంస్కృతికి కూటమి నేతలు తెరతీశారు.

అడ్డూ అదుపూ లేకుండా..

నూజివీడు మండలం తుక్కులూరులో గతేడాది సెప్టెంబర్‌ 23న టీడీపీ గ్రామ అధ్యక్షుడు అన్నే సురేష్‌ కార్యకర్తలు శివరామకృష్ణ, కారుమంచి రాజు, కిరణ్‌లు అదే గ్రామానికి చెందిన అచ్చి నాగరాజు అనే వ్యక్తిని విచక్షణారహితంగా దాడి చేసి కాళ్లు, చేతులను తాళ్లతో కట్టేసి నాగరాజును కారులో పడేసి పోలీస్‌స్టేషన్‌లో అప్పగించిన ఘటన సోషల్‌ మీడియాలో తీవ్ర వైరల్‌గా మారి టీడీపీ సాగిస్తున్న అరాచకానికి మచ్చుతునకగా నిలిచింది. గతేడాది జూన్‌ 6న నూజివీడులో అప్పటి వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ నడకుదురు గిరిష్‌పై టీడీపీ కార్యకర్త నూకల సాయి అరుణ్‌ కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి యత్నించిన ఘటన వీడియో వైరల్‌గా మా రింది. కొద్దిరోజుల క్రితం అధికార పార్టీ ఒత్తిళ్లతో గిరీష్‌ టీడీపీలో చేరారు. అలాగే వేలేరుపాడు మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ శ్రీనివాస్‌ గౌడ్‌పై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో దాడి చేసి గాయపరచడం, ఆగిరిపల్లి గ్రామ సర్పంచ్‌ చిమటా శ్రీనివాసరావు టెంట్‌ హౌస్‌లో టెంట్‌లు, కుర్చీలు, కంప్యూటర్లు ధ్వంసం చేయడం, ఆగిరిపల్లి–2 ఎంపీటీసీ సాదం గోపినాథ్‌, మాజీ ఎంపీటీసీ పండుపై దాడులు, వేలేరుపాడు మండలం తాట్కూరుగొమ్ము ఎంపీటీసీ కొమ్ము రాంబాబు నివాసంపై దాడి చేసి ఇంట్లో ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడం ఇలా వరుస విధ్వంస కాండలు కొనసాగాయి.

అక్రమ కేసులు ఎన్నెన్నో..

● టీడీపీ అరాచకాలకు సోషల్‌ మీడియా కేసులు పరాకాష్టగా మారాయి. పార్టీ రాష్ట్ర కమిటీ, లోకేష్‌ ఆదేశాలతో ప్రతి మండలంలో టీడీపీ మండల అధ్యక్షులు పోలీసులకు ఫిర్యాదు చేయడం, వెంటనే కేసులు నమోదు చేయడం, సీరియస్‌ టార్గెట్‌ అయితే నాన్‌ బెయిల్‌బుల్‌ కేసులు నమోదు చేయడం యథేచ్ఛగా జరిగింది.

● 2023 జూలై 15న నూజివీడులోని వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ రాజశేఖర్‌రెడ్డి పోస్టు పెడితే కొద్దినెలల క్రితం టీడీపీ మండల అధ్యక్షుడు ముసునూరు సీతారామాంజనేయ ప్రసాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడం రెండేళ్ల క్రితం ఘటనపై నాన్‌ బెయిల్‌బుల్‌ సెక్షన్ల కింద అరెస్టు చేసి జైలుకు పంపడం జరిగింది.

● లింగపాలెం మండలం మఠంగూడెంలోనూ ఇదే తరహాలో టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో ముగ్గురు వైఎస్సార్‌సీపీ నాయకులు అరైస్టె 45 రోజులపాటు రిమాండ్‌లో ఉన్నారు.

● నిడమర్రు మండలంలో సోషల్‌ మీడియా కో–కన్వీనర్‌ బేతు సతీష్‌ మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి, న్యాయం చేయండని అన్నందుకు అరెస్టు చేశారు.

● బాపట్ల టౌన్‌ ఇస్లాంపేటకు చెందిన షేక్‌ సయ్యద్‌ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెట్టాడని చింతలపూడి టీడీపీ మండల కన్వీనర్‌ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

● కొయ్యలగూడెంలో వైఎస్సార్‌సీపీకి చెందిన మద్దిపాటి కృష్ణ, జింటా వెంకటేశ్వరరావు, పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు తోట జయబాబుపై హత్యాయత్నం చేయడమే కాకుండా తిరిగి వారిపైనే కేసులు నమోదుచేశారు.

● కన్నాపురం సర్పంచ్‌ భర్త కృష్ణపై కూటమి నేతలు దాడి చేసి అతనిపైనే రివర్స్‌ కేసులు నమోదు చేయించారు.

అరాచకం కట్టలు తెంచుకుంది.. రెడ్‌బుక్‌ పేరుతో కూటమి నేతల దౌర్జనకాండ సాగింది.. పల్లెల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులే లక్ష్యంగా భారీస్థాయిలో భౌతికదాడులు మొదలు ఆస్తుల విధ్వంసం కొనసాగింది. ప్రశాంతతకు మారుపేరైన పల్లెల్లో వ్యక్తిగత విద్వేషాలు, దాడులు, అడ్డగోలుగా కేసుల నమోదు, అరెస్ట్‌లు జరిగాయి. వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లపై దాడులు, వ్యక్తిగతంగా భౌతిక దాడులు, ఆస్తి నష్టాలపై ఫిర్యాదులు చేసినా పోలీసులు కేసులు నమోదు చేయనిపరిస్థితి. ఇలా కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో జిల్లాలో రెడ్‌బుక్‌ రాజ్యాంగమే అమలైంది. అమాత్యులు మొదలు ప్రజాప్రతినిధులంతా వ్యక్తిగత టార్గెట్‌లను నిస్సిగ్గుగా కొనసాగించారు.

దెందులూరులో రెచ్చిపోయిన మూకలు

దెందులూరు మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కామిరెడ్డి నాని నివాసంపై గతేడాది జూలై 7న వందల సంఖ్యలో కూటమి కార్యకర్తలు మూకుమ్మడి దాడి చేసి కార్యాలయ అద్దాలు, కుర్చీలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దాదాపు మూడు రోజుల పాటు పోలీస్‌ పికెటింగ్‌ హడావుడి కొనసాగినా కేసులు, అరెస్టులు జరగలేదు. అలాగే పెదవేగి మండలం కవ్వగుంట మాజీ సర్పంచ్‌ మద్దాల నాగయ్యపై టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడి చేసి గాయపరిచారు. పెదపాడు మండలం, ఏలూరు రూరల్‌ మండలం, పెదవేగిలోనూ పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు, చేపల చెరువు సాగుకు అడ్డంకులు కల్పించడం యథేచ్ఛగా సాగాయి. దెందులూరు జెడ్పీటీసీ నిట్టా లీలా నవకాంతం మామ గాంధీపై దాడి, క్రియాశీలక కార్యకర్త రవీంద్ర ఆటో విధ్వంసం అలాగే దెందులూరులో వైఎస్సార్‌ విగ్రహాన్ని, ప్రభుత్వ శిలాఫలాకలను ధ్వంసం చేయడం ఇలా టీడీపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు.

కూటమి రెడ్‌బుక్‌ రాజ్యాంగం

జిల్లాలో అంతులేని అరాచకం

వైఎస్సార్‌సీపీ శ్రేణులే లక్ష్యంగా దాడులు

తుక్కులూరులో వ్యక్తిపై దాడి చేసి తాళ్లతో నిర్బంధం

నూజివీడు, చింతలపూడి, పోలవరంలో దాడుల పర్వం

దెందులూరులో అధికార పార్టీ నేతల విధ్వంసాలు

వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలపై కేసులు

కూటమి ఏడాది పాలనంతా దౌర్జన్యాలే..

ఏడాది నిండా.. దౌర్జన్యకాండ 1
1/4

ఏడాది నిండా.. దౌర్జన్యకాండ

ఏడాది నిండా.. దౌర్జన్యకాండ 2
2/4

ఏడాది నిండా.. దౌర్జన్యకాండ

ఏడాది నిండా.. దౌర్జన్యకాండ 3
3/4

ఏడాది నిండా.. దౌర్జన్యకాండ

ఏడాది నిండా.. దౌర్జన్యకాండ 4
4/4

ఏడాది నిండా.. దౌర్జన్యకాండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement