9న ఆయిల్‌పామ్‌ రైతుల ధర్నా | - | Sakshi
Sakshi News home page

9న ఆయిల్‌పామ్‌ రైతుల ధర్నా

Jun 7 2025 12:55 AM | Updated on Jun 7 2025 1:04 AM

9న ఆయిల్‌పామ్‌ రైతుల ధర్నా

9న ఆయిల్‌పామ్‌ రైతుల ధర్నా

పెదవేగి: కేంద్ర ప్రభుత్వం పామాయిల్‌పై 10 శాతం దిగుమతి సుంకం తగ్గించడాన్ని నిరసిస్తూ ఈనెల 9న ఉదయం 10 గంటలకు ఏలూరు కలెక్టరేట్‌ వద్ద ఆయిల్‌పామ్‌ రైతుల ధర్నా, రైతుల సామూహిక రాయబార కార్యక్రమం చేపట్టినట్టు ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్‌ తెలిపారు. శుక్రవారం విజయరాయిలో ఆయిల్‌పామ్‌ రైతుల సమావేశాన్ని మున్నంగి సుబ్బారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ధర్నా కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ దిగుమతి సుంకం తగ్గడంతో ఆయిల్‌పామ్‌ గెలల ధరలు తగ్గి రైతులు నష్టపోతున్నారన్నారు. ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహించేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలన్నారు. పెదవేగిలో ఆయిల్‌ఫెడ్‌ కర్మాగారం ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలన్నారు. రైతులు పూసం రామరెడ్డి, రాపర్ల తేజ కృష్ణ, నీలం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

నేడు రౌండ్‌ టేబుల్‌ సమావేశం

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం (స్ఫూర్తి భవన్‌) ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11 గంటలకు ఆయిల్‌పామ్‌ రైతుల సమస్యలపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేసినట్టు ఏపీ రైతు సంఘం ఏలూరు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పుల్లూరి సోమశేఖరా చార్యులు, రాయంకుల లక్ష్మణరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement