
దుర్వినియోగమైన నిధులు రాబట్టాలి
కై కలూరు: కై కలూరు పంచాయతీలో 2020 నుంచి 2025 వరకు రూ.8,08,58,883 నిధుల అవకతవకలు జరిగాయని వార్డు సభ్యులు కేవీఎన్ఎం నా యుడు, మేడూరు నాంచారయ్య, మంచికంటి శ్రీనివాసరావు, బిరుదుగడ్డ రాజామణి ఆరోపించారు. కై కలూరు పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. అవినీతి ఫిర్యాదులపై నూజివీడు, జంగారెడ్డిగూడెం డీఎల్పీఓలు విచార ణ చేసి నివేదిక కలెక్టర్కు అందించారన్నారు. సర్పంచ్ దానం మేరీ నవరత్నకుమారి, పంచాయతీ ఈఓలకు షోకాజు నోటీసులు ఇచ్చారన్నారు. దుర్వినియోగమైన నిధులను తిరిగి పంచాయతీకి చెల్లించా లని డిమాండ్ చేశారు. అలాగే పంచాయతీ కార్యాలయంలో పౌర సేవ పత్రాన్ని అమలు చేయాలని కో రారు. పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులకు నా లుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, వాటిని చెల్లించకపోతే వార్డు సభ్యులంతా ఆమరణ నిరాహర దీక్ష చేస్తామన్నారు. పలు వార్డుల్లో పారిశుద్ధ్య సమస్య ఏర్పడుతోందని చెప్పారు. సమస్యలను ఎమ్మెల్యే కామినేని దృష్టికి తీసుకువెళతామన్నారు.
ముగిసిన టీఓటీ శిక్షణ
ఏలూరు(మెట్రో): స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో మూడు రోజుల పాటు జరిగిన టీఓటీ (ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్) శిక్షణ కార్యక్రమం శుక్రవా రం ముగిసినట్లు వ్యవసాయశాఖ అధికారి హబీబ్ బాషా తెలిపారు. ప్రకృతి వ్యవసాయాన్ని ఎలా విస్తరించాలి, రైతులకు ఎలా మద్దతు ఇవ్వాలి అనే అంశాలపై విస్తృతంగా చర్చించామన్నారు.