
కంగారులో రైలు దిగేసిన జార్ఖండ్ మహిళ
ఏలూరు టౌన్: జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఒక మహిళ కంగారులో దెందులూరులో రైలుబండి దిగిపోగా, ఆమెను తిరిగి బంధువులకు అప్పగించినట్లు ఏలూరు రైల్వే ఎస్సై పీ.సైమన్ తెలిపారు. జార్ఖండ్ రాష్ట్రం బిదండి గ్రామానికి చెందిన అనిత ముర్ము అనే మహిళ భర్త రాంలాల్తో కలిసి కేరళ రాష్ట్రానికి పనులు చేసుకునే నిమిత్తం ఈనెల 1వ తేదీన బొకారో ఎక్స్ప్రెస్ రైలులో థన్బాద్ నుంచి ఎర్నాకుళం వెళుతుంది. రైలుబండి దెందులూరు సమీపానికి వచ్చేసరికి భర్త రాంలాల్ కనిపించకపోవడంతో భయంతో అనిత ముర్ము రైలు దిగిపోయింది. ఆమెను గమనించిన రైల్వే సిబ్బంది ఏలూరు రైల్వే పోలీస్స్టేషన్కు తీసుకువచ్చి అప్పగించారు. అనంతరం రైల్వే ఎస్సై సైమన్ మహిళను వన్స్టాప్ సెంటర్లో ఉంచారు. అనంతరం మహిళ వివరాలు సేకరించి బంధువులను ఏలూరు రప్పించారు. మహిళ భర్త రాంలాల్, అన్నలు ఏలూరు రైల్వే పోలీస్స్టేషన్కు రాగా మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చి భర్తకు అప్పగించారు.
20 లీటర్ల ఈఎన్ఏ స్పిరిట్ స్వాధీనం
చింతలపూడి: చింతలపూడి సర్కిల్ పరిధిలో బుధవారం దాడులు నిర్వహించి 20 లీటర్ల ఈఎన్ఏ స్పిరిట్ (ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ స్పిరిట్)ను స్వాధీనం చేసుకున్నట్లు చింతలపూడి ఎకై ్సజ్ సీఐ పి.అశోక్ తెలిపారు. చింతలపూడి కాంచనగూడెంలో మారుమూడి నాగబాబు నుంచి 5 లీటర్లు, కాలబత్తుల అనిత వద్ద నుంచి లీటరు, ప్రగఢవరంలో కాగిత నాగేశ్వరమ్మ వద్ద నుంచి 5 లీటర్లు, లింగపాలెం మండలం అన్నపనేనివారిగూడెంలో బేతు రమేష్ వద్ద నుంచి 7 లీటర్ల ఈఎన్ఏ స్పిరిట్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరికి చిట్లూరి కిషోర్ అనే వ్యక్తి నల్లజర్ల మండలం ఆవులపాడు డిస్టలరీ నుంచి చోరీ చేసిన ఈఎన్ఏ స్పిరిట్ను అమ్ముతున్నట్లు విచారణలో తెలిసిందన్నారు. కిషోర్ నుంచి కూడా 2 లీటర్ల ఈఎన్ఏ స్పిరిట్ను స్వాధీనం చేసుకుని ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. టీఎస్టీఎఫ్ ఏఈఎస్ జి.పాండురంగారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో ఈఎస్టీఎఫ్ సీఐ ఆర్.సత్యవతి, ఎస్సై ఎండీ ఆరీఫ్, చింతలపూడి ఎకై ్సజ్ ఎస్సైలు ఆర్ నరసింహరావు, జె.జగ్గారావు, అబ్దుల్ ఖలీల్, సిబ్బంది పాల్గొన్నారు.