జిల్లా స్థాయి కార్యశాల శిక్షణ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

జిల్లా స్థాయి కార్యశాల శిక్షణ ప్రారంభం

Jun 4 2025 1:13 AM | Updated on Jun 4 2025 1:13 AM

జిల్లా స్థాయి కార్యశాల శిక్షణ ప్రారంభం

జిల్లా స్థాయి కార్యశాల శిక్షణ ప్రారంభం

ఏలూరు (టూటౌన్‌): స్థానిక సుబ్బమ్మదేవి మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో మూడు రోజుల జిల్లా స్థాయి కార్యశాల శిక్షణా కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. జిల్లా కో ఆర్డినేటర్‌గా డీఈఓ వెంకటలక్ష్మమ్మ వ్యవహరించారు. అకడమిక్‌ కాలెండర్‌, టీచర్‌ హ్యాండ్‌ బుక్‌, స్టూడెంట్‌ అసెస్‌మ్మెంట్‌ బుక్‌, కరిక్యులమ్‌ ఇంటిగ్రేషన్‌ అనే అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. అసిస్టెంట్‌ జిల్లా కోఆర్డినేటర్‌ అంగులూరి సర్వేశ్వరరావు మంగళవారం కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా ఎస్‌సీఈఆర్‌టీ రాజబాబు హాజరయ్యారు. శిక్షణకు 162 మంది డీఆర్‌పీలు, 12 మంది ప్రధానోపాధ్యాయులు హాజరయ్యారు. వీరు క్షేత్ర స్థాయిలో ఉన్న 3,250 స్కూల్‌ అసిస్టెంట్స్‌, ప్రధానోపాధ్యాయులకు ఈ నెల 8, 9, 10 తేదీల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు సర్వేశ్వరరావు తెలిపారు. 6వ తరగతి విద్యార్ధులకు సంసిద్దతా కార్యక్రమాలు, 9వ తరగతి విద్యార్థులకు జనవరిలో పరీక్షలు పూర్తిచేసి 10వ తరగతికి 40 రోజులు బ్రిడ్జి కోర్సు ముఖ్యాంశాలని రాజబాబు తెలిపారు. 1, 2 తరగతులకు, 9, 10 తరగతులకు ప్రత్యేక పాఠ్యపుస్తకాలుగా కమిషనర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ విజయ రామరాజు, డైరెక్టర్‌ ఎంవీ కృష్ణారెడ్డి నేతృత్వంలో రూపొందాయని వివరించారు. కార్యక్రమంలో డైట్‌ లెక్చరర్స్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement