
దగా పాలనకు ఏడాది
సీ వీడ్.. సో గుడ్
సముద్రపు నాచు (సీ వీడ్) తీరప్రాంత మహిళలకు కుటీర పరిశ్రమగా మారుతోంది. తక్కువ కాలంలోనే అధిక దిగుబడులు సాధించే నాచు పెంపకానికి డిమాండ్ పెరుగుతోంది. 8లో u
దగా పాలనకు నేటితో ఏడాది పూర్తయ్యింది. సూపర్ సిక్స్ అంటూ ప్రజలను మభ్యపెట్టి తీరా గెలిచాక ఓట్లేసిన వారిని వెన్నుపోటు పొడిచారు. పోలవరాన్ని ప్రత్యేక జిల్లా చేస్తామని.. కొల్లేరుకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని.. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని.. ఇలా జిల్లా స్థాయిలో పదుల సంఖ్యలో హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చాక పూర్తిగా గాలికి వదిలేశారు. ఒక్క సంక్షేమ పథకం అమలు కాలేదు. అభివృద్ధి పనులు చేపట్టలేదు. రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో మాత్రం దాడులు, దౌర్జన్యాలు కొనసాగిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది కాలంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేకుండా కూటమి ప్రభుత్వం వ్యక్తిగత ఎజెండాతో ముందుకు వెళ్తోంది.
ఇదేం పరేషన్
బుధవారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2025
నిరసన గళం వినిపించాలి
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు
నరసాపురం: బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు ప్రజలను నిలువునా మోసం చేసిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. కూటమి ఏడాది పాలనలో మహిళలు, విద్యార్ధులు, కార్మికులు ఇలా.. అన్ని వర్గాల ప్రజలు దగా పడ్డారని విమర్శించారు. జూన్ 4న వెన్నుదినంగా పరిగణించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వైఎస్సార్సీపీ నిర్ణయించిందని చెప్పారు. నిరసన కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేయాలని చెప్పారు. యువత పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడాలన్నారు. 2019–24 మధ్య వైఎస్సార్సీపీ స్వర్ణయుగం పాలన నడిచిందని.. అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని గద్దెనెక్కిన ఏడాదిలోపే అమలు చేశారని గుర్తుచేశారు. నేడు కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేసి పాలన సాగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మఒడి లాంటి పథకాలు అమలుకాక పేద, మధ్య తరగతి పిల్లల చదువులు భారంగా మారాయని అన్నారు.
వేతనాల కోసం ఉపాధి కూలీల ధర్నా
పెంటపాడు: గత మూడు నెలలుగా ఉపాధి కూలీలకు వేతనాలు అందకపోవడంతో ఉపాధి కూలీలు నిరసన చేపట్టారు. వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి కళింగ లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఆకుతీగపాడు, బోడపాడు, ముదునూరు గ్రామాలలో నిరసన తెలిపారు. పనిచేస్తున్న ప్రదేశాలలో పలువురు కూలీలు మాట్లాడుతూ ఏప్రిల్ నెల నుంచి ఇంత వరకు వేతనాలు అందలేదన్నారు. పెరిగిన ధరలతో ఒక పక్క ఇబ్బందులు పడుతున్నామని, మరోవైపు కూలి పనులు చేసినా పస్తులు ఉండాల్సి వస్తోందని వాపోయారు. కూటమి ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉందన్నారు.
రేషన్ డిపోల రద్దుకు కుట్ర
భీమవరం: చౌక డిపోల ద్వారా ప్రజలకిచ్చే రేషన్ సరుకుల రద్దుకు ప్రభుత్వం కుట్రచేస్తోందని దీనిలో భాగంగానే నగదు బదిలీ అంటూ ప్రచారం చేస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి జెఎన్వీ గోపాలన్ విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేస్తూ రేషన్ వద్దనుకుంటే నగదు బదిలీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. చౌకడిపోలను పూర్తిగా తీసేయాలనే ఆలోచనే చేస్తున్నారన్నారు. రేషన్ సరఫరాలో అక్రమాలు, అవినీతి ఉంటే వాటిని అరికట్టే చర్యలు తీసుకోవాలి తప్ప డీబీటీ విధానం సరైంది కాదన్నారు. తెలంగాణలో తరహా సన్న బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రేషన్ సరుకులు చౌక డిపోలతో పాటు ఇంటింటికి వాహనాల ద్వారా ఇవ్వాలని, అన్ని రకాల నిత్యావసర సరుకులను రేషన్ ద్వారా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఏలూరులో
12 కరోనా కేసుల నమోదు
ఏలూరు టౌన్: కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. చాపకింద నీరులా పాజిటివ్ కేసులు మెల్లగా పెరుగుతున్నాయి. ఇంతవరకూ మొత్తం 12 కరోనా కేసులు నమోదుయ్యాయి. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం ప్రజలను అప్రమత్తం చేయటంలో విఫలమయ్యారు. తాజాగా మంగళవారం మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు ఏలూరులో నమోదయ్యాయి. నగరంలోని నరసింహారావుపేటలో ఒకటి, మోతేవారి తోటలో కరోనా కేసు నమోదైంది. సోమవారం మంచినీళ్ళతోట, వెంకటాపురం పంచాయతీల్లో ఇద్దరు మహిళలకు కరోనా సోకింది. ఇప్పటికే ఏలూరు కలెక్టరేట్లో ఐదుగురు ఉద్యోగులకు, అమీనాపేటలో ఒకరికి, శాంతినగర్లో ఇద్దరు రిటైర్డ్ ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా సోకిన బాధితులను హోమ్ ఐసోలేషన్లో ఉంచి చికిత్స పొందేలా వైద్యులు చర్యలు చేపట్టారు. ఏలూరు జీజీహెచ్లోని వీఆర్డీఎల్ ల్యాబ్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం సుమారు 162 కరోనా పరీక్షలు చేసినట్లుగా వైద్యాధికారులు చెబుతున్నారు.
1,684 కేసుల నమోదు
ఏలూరు (టూటౌన్): మే నెలలో జిల్లా వ్యాప్తంగా రవాణా, వ్యక్తిగత వాహనాలపై 1,684 కేసులు నమోదు చేసి రూ.1.03 కోట్లను అపరాధ రుసుంగా విధించినట్లు ఉప రవాణా కమిషనరు షేక్ కరీమ్ తెలిపారు. పన్ను చెల్లించని 72 వాహనాలు సీజ్ చేశామన్నారు.
సాక్షి ప్రతినిధి, ఏలూరు : కూటమి ప్రభుత్వం కొలువుదీరి బుధవారంతో ఏడాది పూర్తవుతుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు జిల్లాలో ఇళ్ల పట్టాలు మొదలుకొని ఇతర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత ఒక్క పని కూడా మొదలు పెట్టకపోగా ప్రకటించిన హామీలను అటకెక్కించి సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు.
హామీలన్నీ గాలికే
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో ఏలూరు జిల్లాకు లెక్కకు మించి హామీలు గుప్పించారు. ఏలూరులో పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి కల్పిస్తామన్నారు. ఇప్పుడు ఉన్న పరిశ్రమలు మూసివేసేలా వ్యవహరిస్తున్నారు. పోలవరం ప్రత్యేక జిల్లా చేస్తామన్నారు. ఆ హామీ గాలికి వదిలేశారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేసే బాధ్యత నాదంటే నాదని చంద్రబాబునాయుడు, పవన్ ఇద్దరూ ప్రకటించి పూర్తిగా విస్మరించారు. రూ.4 వేల కోట్లతో చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తయితే లక్షలాది ఎకరాలు సాగులోకి వస్తాయి. పోలవరం నిర్వాసితులకు ఆరు నెలల్లో పరిహారం పూర్తి చేస్తామన్నారు. దాన్ని ఏడాది దాటినా కనీసం పట్టించుకోలేదు. నూజివీడులో మామిడి పరిశ్రమల ఏర్పాటు, కొల్లేరు ఆక్రమణలు తొలగించి స్థానికులకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. కోర్టు కేసుల పేరుతో విజయవంతంగా పెండింగ్లో పెట్టారు. 7 నియోజకవర్గాల్లో 40కు పైగా ప్రధాన హామీలిచ్చి ఒక్క హామీ కూడా అమలుచేయ లేదు.
రెడ్బుక్ పేరుతో ధ్వంస రచన
కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ఏలూరు, పోలవరం, నూజివీడు, దెందులూరు, చింతలపూడిలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేశారు. మొదటి నెలన్నర పాటు పెద్ద ఎత్తున దాడులు చేశారు. ఆ తరువాత వ్యక్తిగత ఆస్తులపై దాడులకు పాల్పడ్డారు. బెదిరింపుల పర్వాన్ని కొనసాగించారు. దెందులూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులతో పాటు చేపలు చెరువుల ధ్వంసం, పట్టుబడులకు అడ్డంకులు సృష్టించారు. అక్రమ గ్రావెల్ దందా కొనసాగిస్తూ అడ్డుకునేందుకు యత్నించిన వారిపై దాడులు చేశారు. పోలవరం నియోజకవర్గంలో మరో అడుగు ముందుకు వేసి ప్రజాప్రతినిధి సొంత టీం పేరుతో అరాచకాలకు తెగబడుతున్నారు. ప్రభుత్వ భూములను పొలిటికల్ లీజ్ పేరుతో ధారాదత్తం చేయడం, అడ్డుకునేవారిపై దాడులు, కేసులు నమోదు చేయించడం పరిపాటిగా కొనసాగిస్తున్నారు.
రీ–సర్వేపై విచారణ చేస్తున్న జేసీ రాహుల్ కుమార్
ఆకివీడు: మండలంలోని కుప్పనపూడి శివారు తాళ్లకోడులోని జగనన్న కాలనీలోని ఇళ్ల రీ–సర్వేపై తుది విచారణను జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం చేపట్టారు. కాలనీలో గత వారం రోజులుగా ఆరు బృందాలు రీ–సర్వే చేశాయి. అనంతరం భీమవరం ఆర్డీఓ ప్రవీణ్ కుమార్రెడ్డి విచారణ చేపట్టారు. కాలనీలో 3,420 మంది నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాల్ని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కేటాయించారు. వారికి పట్టాలు కూడా ఇచ్చారు. ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.1.80 లక్షలు అందజేశారు. దీంతో 1000 మంది గృహ ప్రవేశాలు చేశారు. మరో 1200 ఇళ్ల నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. మిగిలిన నిరుపేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు పునాదులు వేసి, తగిన సొమ్ములేక ఆగిపోయారు. మరికొంత మంది పునాదులు వేసేందుకు సొమ్ములేక ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇళ్లు నిర్మించుకోలేదనే కారణంగా వారి ఇళ్ల స్థలాలను ప్రభుత్వం వెనక్కి తీసుకునేందుకు రీ సర్వే ఏర్పాటు చేశారు. దీనిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిరుపేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు రూ. 4 లక్షలు తక్షణం విడుదల చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసి పేదల ఇళ్ల నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తిచేస్తున్నారు.
రేషన్ షాపుల వద్ద నిత్యావసరాల కోసం జనం అవస్థలు కొనసాగుతున్నాయి. ఇంటి వద్దకే రేషన్కు మంగళం పాడిన కూటమి సర్కారు.. జగన్ సర్కారుకు పేరు వస్తుందనే అక్కసుతో షాపుల వద్దే సరుకులు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో మూడో రోజూ మంగళవారం కూడా కార్డుదారులు అవస్థలు పడ్డారు. చాలా చోట్ల సర్వర్ పనిచేయక క్యూలైన్లో పడిగాపులు కాశారు. వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటికే రేషన్ అమలు కాక చాలా చోట్ల వృద్ధులు షాపులకు వెళ్లి రేషన్ తెచ్చుకునేందుకు ఎండలో ఇక్కట్లు పడ్డారు. – సాక్షి నెట్వర్క్
న్యూస్రీల్
రాష్ట్రంలో మద్యం, గంజాయి పాలన
ఆకివీడు: రాష్ట్రంలో గంజాయి, మద్యం ఏరులైపారడంతో మహిళలు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. స్థానికంగా చిన్నారిపై అఘాయిత్యాన్ని ఖండిస్తూ మంగళవారం నేతలు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి, మండల, పట్టణ వైఎస్సార్సీపీ అధ్యక్షులు నంద్యాల సీతారామయ్య, అంబటి రమేష్, మెప్మా మాజీ అధ్యక్షురాలు మోరా జ్యోతిరెడ్డి, కోఆప్షన్ సభ్యురాలు గుండుగొలను సావిత్రి, ధనరాజు మాట్లాడుతూ ఏడేళ్ల చిన్నారిపై అత్యాచార సంఘటన అమానవీయమన్నారు. టీడీపీకి చెందిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళలకు, చిన్నారులకు రక్షణ కల్పించాలంటే పట్టణ, గ్రామాలకు దూరంగా మద్యం షాపులు ఉండాలన్నారు. బెల్టు షాపుల బెల్టు ఎప్పుడు తీస్తారని ప్రశ్నించారు. గంజాయి అమ్మకాలపై పోలీస్ యంత్రాంగం తీవ్ర నిర్లిప్తతతో ఉందన్నారు. పట్టణంలోని విచ్చలవిడిగా గంజాయి, మద్యం దొరుకుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. నగర పంచాయతీ విప్ పడాల శ్రీనివాసరెడ్డి, గేదెల అప్పారావు పాల్గొన్నారు.
ఎన్నికల ప్రచారంలో హామీల వరద
ఏడాది పూర్తయినా ఒక్క హామీ నెరవేర్చని కూటమి ప్రభుత్వం
రెడ్బుక్ పేరుతో దాడులు, దౌర్జన్యాలు
సంక్షేమం కొరవడి పల్లెల్లో మైక్రో ఫైనాన్స్ వేధింపులు
కూటమి దగాపై జూన్ 4ను ‘వెన్నుపోటు దినం’గా ప్రకటించిన వైఎస్సార్సీపీ
నియోజకవర్గ కేంద్రాల్లో నేడు నిరసన కార్యక్రమాలు
జిల్లాలో జగన్ హయాంలో ఐదేళ్లలో రూ.10 వేల కోట్లకు పైగా లబ్ధి
హామీలు ఏమయ్యాయి
కూటమి నేతలు అన్ని ప్రచార సభలో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు. సంవత్సరమైనా హామీలు ఎందుకు అమలు చేయడం లేదు. తల్లికి వందనం, ఉచిత బస్సు, ఆడబిడ్డ నిధి, రైతన్నకు సాయం, నిరుద్యోగ భృతి పథకాలు అమలు చేయకుండా కోట్ల మంది ప్రజలను దగా చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన తొలి సంవత్సరంలోనే అన్ని హామీలతో పాటు ఇవ్వని పథకాలు అమలు చేశారు.
– మేడూరి రంగబాబు,
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఇంకా వేధిస్తూనే ఉన్నారు
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నా ఇళ్లను ధ్వంసం చేసి, నాపై 9 అక్రమ కేసులు పెట్టారు. నా కుటుంబ సభ్యులను సైతం ఇబ్బంది పెడుతున్నారు. నన్ను నా అనుచరులను వేధిస్తూనే దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సైతం కూటమి పెద్దలకు తలొగ్గి నిబంధనలకు నీళ్లొదిలేశారు. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడు చూడలేదు.
కామిరెడ్డి నాని,
వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు

దగా పాలనకు ఏడాది

దగా పాలనకు ఏడాది

దగా పాలనకు ఏడాది

దగా పాలనకు ఏడాది

దగా పాలనకు ఏడాది

దగా పాలనకు ఏడాది

దగా పాలనకు ఏడాది

దగా పాలనకు ఏడాది

దగా పాలనకు ఏడాది