
అధికారులు న్యాయం చేయాలి
ఓఎన్జీసీ అధికారులు న్యాయం చేయాలని రైతులు ఆందోళన చేశారు. రైతులకు కేవలం ఒక పంటకు మాత్రమే డబ్బులు వేశారని ఆరోపిస్తున్నారు. 8లో u
నాడు సంక్షేమ కాంతులు
వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో సంక్షేమ కాంతులతో జిల్లా వెలుగొందింది. ఏలూరులో ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేసి దశాబ్దాల కలను నిజం చేశారు. రూ.525 కోట్లతో వైద్యకళాశాలకు అనుబంధంగా ఆసుపత్రి అభివృద్ధి చేశారు. 150 ఎంబీబీఎస్ సీట్లతో మొదటి విద్యా సంవత్సరం పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో రూ.వందల కోట్లతో అభివృద్ధి పనులు చేశారు. రూ.10 వేల కోట్లకు పైగా నగదును సంక్షేమ పథకాల ద్వారా ప్రజల ఖాతాలకు జమ చేశారు. 1,16,000 ఇళ్ళ స్థలాలు, రూ.713 కోట్లతో ఇళ్ళ నిర్మాణం, రూ.202 కోట్లతో నాడు–నేడులో స్కూళ్ళ అభివృద్ధి, గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో రూ.78.56 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.193.15 కోట్లతో సచివాలయాలు, 83.79 కోట్లతో రైతు భరోసా కేంద్రాలు, రూ.56.37 కోట్లతో హెల్త్ క్లినిక్ల నిర్మాణం, రూ. 58.49 కోట్లతో వైఎస్సార్ జలకళ పేరుతో బోర్ల తవ్వకం, రూ.606 కోట్లతో జలజీవన్ మిషన్, రూ.627.96 కోట్లతో రహదారుల నిర్మాణాలు, మరమ్మతులు, రూ.26.08 కోట్లతో పీహెచ్సీల అభివృద్ధి ఇలా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారు.
నేడు అన్ని వర్గాలకూ ఇక్కట్లు
గత ప్రభుత్వ హయాంలో మధ్య, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు వివిధ సంక్షేమ పథకాల రూపంలో సగటున రూ.2 లక్షల నుంచి రూ.4.50 లక్షల మేరకు ఏటా లబ్ధి చేకూరింది. పల్లెల్లో అప్పుల ఇబ్బందులు గట్టెక్కడంతో పాటు ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. రైతుభరోసా కేంద్రాల వ్యవస్థ వల్ల దళారీ పాత్రకు తెరపడింది. నేడు ఒక్క పథకం కూడా అమలు కాకపోవడంతో పల్లెల్లో మైక్రో ఫైనాన్స్ సంస్థలు పడగవిప్పి రూ.5 మొదలుకొని రూ.15 వడ్డీ వరకు వసూలు చేస్తూ జోరుగా వ్యాపారం చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో దళారుల రాకతో అన్నదాతకు కష్టాలు మొదలయ్యాయి. కొద్ది రోజుల క్రితం ప్రైవేటు ఫైనాన్స్ అప్పు తిరిగి చెల్లించడానికి ఇబ్బంది పడి పెదవేగి మండలం కే.కన్నాపురం గ్రామానికి చెందిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వేలాది మందికి భూ పంపిణీ
జిల్లాలో వేలాది మంది లబ్ధిదారులకు 20 ఏళ్ళ తరువాత భూ పంపిణీ ప్రక్రియ వైఎస్ జగన్ హయాంలో జరిగింది. 656 మంది రైతులకు 524.116 ఎకరాలు పంపిణీ చేశారు. 9172 మంది రైతులకు ప్రయోజనం చేకూరేలా 11,715.32 ఎకరాల భూమిని అసైన్డ్ 22(ఎ) నుంచి తొలగించి పూర్తి హక్కులు కల్పించారు. 611 మంది ఎస్సీలకు 391.45 ఎకరాల భూమిని అప్పగించారు. అలాగే 26 గ్రామాల్లో ఎస్సీ శ్మశాన వాటికలకు భూమిని కేటాయించారు.