హక్కులను కాలరాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు | - | Sakshi
Sakshi News home page

హక్కులను కాలరాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

Jun 3 2025 5:29 AM | Updated on Jun 3 2025 5:29 AM

హక్కులను కాలరాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

హక్కులను కాలరాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

ఏలూరు (టూటౌన్‌): రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను అమలు చేయాల్సిన అధికారులు, ప్రజా ప్రతినిధులు వాటిని కాలరాస్తున్నారని, రక్షించాల్సిన వారే వాటిని భక్షించే పరిస్థితి నెలకొందని ఆల్‌ ఇండియా అంబేడ్కర్‌ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ మెండెం సంతోష్‌ కుమార్‌, ఏఐఆర్‌డీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్‌.మణిసింగ్‌ అన్నారు. స్థానిక లేడీస్‌ క్లబ్‌లో ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అంశంపై సోమవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు మానవ హక్కులను కాలరాస్తున్నాయన్నారు. ముఖ్యంగా దళితులపై అరాచకాలకు పాల్పడుతూ వారి పట్ల వివక్షతను కొనసాగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్రంలో రెవెన్యూ,పోలీస్‌ వ్యవస్థలు వైఫల్యం చెందాయని.. పిఠాపురం నియోజకవర్గం, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో దళితులపై జరిగిన దాడులే నిదర్శనమన్నారు. సమావేశంలో అటవీ శాఖ మాజీ డైరెక్టర్‌ పల్లెం ప్రసాద్‌, రిటైర్డ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి చాగంటి సంజీవ్‌ కుమార్‌, డాక్టర్‌ నిట్టా ప్రసాద్‌, దాసరి రమేష్‌, దోమతోటి అబ్రహాం, సింగవరపు జ్యోతి, విజయ కుమారి, మాముడూరు మహాంకాళి, నూకపెయ్యి కార్తీక్‌, లాయర్‌ రాజశేఖర్‌, కనికెళ్ళి రవిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement