మెట్ట రైతులను ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

మెట్ట రైతులను ఆదుకోవాలి

Jun 3 2025 5:29 AM | Updated on Jun 3 2025 5:29 AM

మెట్ట రైతులను ఆదుకోవాలి

మెట్ట రైతులను ఆదుకోవాలి

జంగారెడ్డిగూడెం : గత 6 నెలలుగా సరైన గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు అన్నారు. సోమవారం జంగారెడ్డిగూడెంలో ఆయన మాట్లాడుతూ పామాయిల్‌, పొగాకు, కోకో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. పామాయిల్‌ మార్కెట్‌లో రూ.20,000 ధర పలుకుతుంటే కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం 26 శాతం నుంచి ఒక్కసారిగా 10 శాతం తగ్గించడం వల్ల ధర తగ్గే పరిస్థితులు కనబడుతున్నాయి. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని, పామాయిల్‌ ధరలు రూ.15 వేలకు పడిపోయే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. పొగాకు రైతులకు సరైన గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారని, వెంటనే పొగాకు రైతులకు గిట్టుబాటు ధర అందించాలని కోరారు. కోకో అంతర్జాతీయ మార్కెట్లో రూ.800 పైగా ఉంటే రాష్ట్రంలో కేవలం కేజీ రూ.400కు మాత్రమే కొంటున్నారని, రైతులను పూర్తిగా నష్టాల పాలు చేస్తున్నారని విమర్శించారు. వెంటనే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని.. అవసరమైతే ఈ ప్రాంతం తీసుకొచ్చి రైతుల దుస్థితిని వివరిస్తామని చెప్పారు. రైతులు అధైర్య పడవద్దని గిట్టుబాటు ధర కోసం కలిసికట్టుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొద్దామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు, మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వామిశెట్టి హరిబాబు, మళ్లిడి బాబి, కొయ్యే లీలాధర్‌ రెడ్డి, ఇర్ల శ్రీనివాస్‌ రెడ్డి, అట్లూరి రామరాజు, సీతంపేట మాజీ సర్పంచ్‌ మిరియాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement