
మల్లఖాంబ్ జాతీయ పోటీలకు భీమవరం క్రీడాకారులు
భీమవరం: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న 7వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో మల్లఖాంబ్ పోటీలకు భీమవరం పట్టణానికి చెందిన క్రీడాకారులు 9 మంది ఎంపికయ్యారని ఎస్సీహెచ్బీఆర్ఎమ్ స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయుడు జీపీసీ శేఖర్రాజు చెప్పారు. బీహార్ రాష్ట్రం బుద్ధగయలో జరిగే పోటీలకు రాష్ట్ర జట్టులో 12 మంది పాల్గొంటుండగా భీమవరం పట్టణానికి చెందిన పి.రోహిత్కుమార్, ఆర్.మనీషా, ఎ.భువనచంద్రిక, వైష్ణవి, బి.కీర్తి, జి.దివ్యజ్యోతి, ఎం.ఆదిత్యవెంకటదుర్గ, డి.ప్రసాద్, పి.గోపీకృష్ణ ఉన్నారని తెలిపారు. మల్లఖాంబ్ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులను శేఖర్రాజు, పీఈటీ ఎం.లక్ష్మి అభినంధించారు.
మోటార్సైకిల్ చోరీపై కేసు నమోదు
భీమవరం: మోటార్సైకిల్ చోరీపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ ఎస్సై రెహమాన్ తెలిపారు. పట్టణంలోని ఏఎస్ఆర్ నగర్లో పి జ్యోతి తన ఇంటి వద్ద ఆదివారం రాత్రి బండి పార్కింగ్ చేయగా సోమవారం తెల్లవారేసరికి కన్పించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ముద్దాడ
పాలకొల్లు సెంట్రల్: జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పాలకొల్లుకు చెందిన ముద్దాడ గణేష్ భవానీ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యకు కృతజ్ఞతలు తెలియజేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకూ నియోజకవర్గ, డివిజన్, జిల్లాకు అధ్యక్షుడిగా, రాష్ట్ర పదవుల్లో ప్రధాన కార్యదర్శి, ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి, ప్రచార కమిటీ చైర్మన్, వర్కింగ్ అధ్యక్షుడిగా పనిచేశానన్నారు. ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడిగా సంఘం మరింత అభివృద్ధి చెందడానికి తనవంతు కృషి చేస్తానని గణేష్ భవానీ చెప్పారు. గణేష్ నియామకం పట్ల రాష్ట్ర బీసీ నాయకులు, ప్రజాప్రతినిధులు అభినందనలు తెలియజేశారు.

మల్లఖాంబ్ జాతీయ పోటీలకు భీమవరం క్రీడాకారులు