
సీహెచ్ఓల ధర్నాకు మద్దతు
భీమవరం(ప్రకాశంచౌక్): భీమవరం కలెక్టరేట్ వద్ద ఐదు రోజులుగా ధర్నా చేస్తున్న విలేజ్ క్లినిక్ల సీహెచ్ఓలకు ఎమ్మెల్సీ గోపిమూర్తి శుక్రవారం మద్దతు తెలిపారు. సమస్యను ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళతానన్నారు. అనంతరం సీహెచ్ఓలతో కలిసి జేసీ రాహుల్కుమార్రెడ్డికి వినతిపత్రం అందించారు.
జడ్జీల బాధ్యతల స్వీకరణ
నూజివీడు: నూజివీడుకు బదిలీ అయిన పలువురు జడ్జీలు శుక్రవారం బాధ్యతలు స్వీకరించా రు. ఒకటో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఓ.అనూష (నెల్లూరు), రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె.శ్రావణి (జగ్గయ్యపేట) బాధ్యతలను చేపట్టారు. నూజివీడులో రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి శివపార్వతి ఇక్కడే ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు. న్యాయవాదులు వారిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
4న ప్రభుత్వ ఉద్యోగుల సంఘ ఎన్నికలు
ఏలూరు (టూటౌన్): ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏలూరు తాలూకా ఎన్నికలు ఈనెల 4న టీటీడీ కల్యాణ మండపం ఎదురుగా ఉన్న సంఘ కార్యాలయంలో జరుగుతాయని జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.రాము, ఎన్ఎస్వీ రామకృష్ణారావు, ఎన్నికల అధికారి వై.శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు. అలాగే రాష్ట్ర మహాసభ జూన్లో విజయవాడలో నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.
పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఈనెల 12 నుంచి జరుగనున్న ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును మూడు రోజులపాటు పొడిగించినట్టు ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాన్ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈనెల 5 వరకు అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
రమేష్కు ‘అకడమిక్’ అవార్డు
పాలకోడేరు: తమ కళాశాల అకడమిక్ అడ్వైజర్, మెంటర్ పి.వెంకట రమేష్ అకడమిక్ అడ్వైజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నట్టు బైట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ కొప్పర్తి సురేష్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఏషియా టుడే మీడియా సంస్థ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరిగిన విశ్వ విద్యా సమ్మేళనం– 2025లో కేంద్ర మంత్రి చేతులమీదుగా రమేష్ అవార్డు అందుకున్నారన్నారు. కళాశాల చైర్మన్ అడబాల శ్రీ వెంకటేశ్వరరావు, సెక్రటరీ, కరస్పాండెంట్ అడ్డాల శ్రీహరి, డీన్కురెళ్ల భాస్కరరావు, హెచ్ఓడీలు రమేష్ను అభినందించారు.
పారిజాతగిరిలో తిరునక్షత్ర వేడుకలు
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెంలోని గో కుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వరస్వా మి దేవస్థానంలో శుక్రవారం విశిష్టాద్వైత సి ద్ధాంత ప్రచారకులు భగవద్ రామానుజాచార్యస్వామి వారి తిరు నక్షత్ర వేడుకలు వైభవంగా నిర్వహించారు. వేంకటేశ్వర స్వామి ధృవమూర్తితో సహా భగవద్ రామానుజాచార్య స్వామికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో రామానుజాచార్య స్వామి ఉత్సవమూర్తిని ప్రత్యేక వేదికపై అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాన అర్చకులు నల్లూరు రవికుమార్ ఆచార్యులు ఆధ్వర్యంలో పూజాదికాలు జరిగాయి. జంగారెడ్డిగూడెం వికాస తరంగిణి ఆధ్వర్యంలో కార్య క్రమాలు నిర్వహించారు. ఏర్పాట్లను ఈఓ మానికల రాంబాబు పర్యవేక్షించారు.
7,500 మంది తరలింపు
భీమవరం(ప్రకాశంచౌక్): అమరావతి రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమ సభకు పశ్చిమగో దావరి జిల్లా నుంచి బయలుదేరి వెళ్లే బస్సుల ను కలెక్టర్ సీహెచ్ నాగరాణి శుక్రవారం భీమవరం పాత బస్టాండ్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. 150 బస్సుల్లో 7,500 మంది ప్రజలు బయలుదేరి వెళ్లారని చెప్పారు.

సీహెచ్ఓల ధర్నాకు మద్దతు

సీహెచ్ఓల ధర్నాకు మద్దతు