
జిల్లా అధికారుల శ్రమదానం
రొయ్యను మేమే అమ్ముకుంటాం
రొయ్య రైతులు తమ పంటను తామే విక్రయించుకోవాలనే సంకల్పంతో డొమెస్టిక్ సేల్స్ కౌంటర్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 4లో u
ఏలూరు (టూటౌన్): స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఏలూరులో కృష్ణా కాలువ గట్లపై అధికారులు శ్రమదానం కార్యక్రమం చేపట్టారు. చెత్తాచెదారాలు, వ్యర్థాలను తొలగించారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి స్వయంగా పాల్గొని శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యకర జీవన విధానం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలన్నారు. ఎలక్ట్రానిక్, ప్లాస్టిక్ వ్యర్థాలను మున్సిపాలిటీ వారికి అప్పగించాలని కోరారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరుగుతుందన్నారు. జేసీ ధాత్రిరెడ్డి మాట్లాడుతూ ఏలూరులోని కాలువలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి ఆహ్లాదకర ప్రదేశాలుగా మా ర్చడమే కార్యక్రమం ఉద్దేశమన్నారు. డీఆర్వో వి. విశ్వేశ్వరరావు, ఆర్డీఓ అచ్యుత అంబరీష్, నగరపాలక సంస్థ కమిషనర్ భానుప్రతాప్, డిఎస్పీ డి.శ్రావణ్కుమార్, ఇరిగేషన్ ఎస్ఈ నాగార్జునరావు తదితరులు పాల్గొన్నారు.