
పాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారణ జరపాలి
భీమవరం అర్బన్: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ చేయాలని పాస్టర్లు వర్థనపు లాబాను, ప్రసన్నకుమార్, డెలిగేట్లు టి.విజయబాబు, బి.భాగ్యానందం, బి.సునీల్, పి.చిట్టిబాబు డిమాండ్ చేశారు. భీమవరం మండలంలోని వెంపలో పెదపేటలో అంబేద్కర్ విగ్రహం నుంచి బస్టాండ్ వరకు సోమవారం శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ప్రజలు అనేక అనుమానాలతో ఉన్నారని ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయాలన్నారు. రాష్ట్ర వాప్తంగా దళితులు, క్రైస్తవులు, మైనారిటీలపై దాడులను అరికట్టాలన్నారు. సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు ఇంజేటి శ్రీనివాస్ శాంతి ర్యాలీకి మద్దతు ప్రకటించి మాట్లాడారు. ఇంజేటి జయమణి, ప్రభాకర్రావు, బల్ల సుబ్బారావు, కడిమి పౌల్ రాజు తదితరులు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెంలో..
పెంటపాడు: పాస్టర్ పగడాల అకస్మిక మృతిపై ప్రభుత్వం తక్షణం న్యాయ విచారణ జరిపి, దోషులపై చర్యలు తీసుకోవాలని గూడెం క్రైస్తవ జేఏసీ నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం గూడెంలోని పలు డినామినేషన్లకు చెందిన క్రైస్తవులు, దైవసేవకులు, మ్యూజిక్ టీం సభ్యులు, క్రైస్తవ గాయకులు గూడెం క్రైస్తవ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ ప్రవీణ్ పగడాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జేఏసీ సభ్యులు మాట్లాడుతూ నిజాలు నిగ్గు తేల్చి తక్షణం దోషులపై చర్యలు తీసుకోవాలన్నారు. క్రైస్తవులపై ఇటీవల దాడులు పెరిగిపోయాయనడానికి ఈ ఉదంతమే కారణమన్నారు. శిలువ శ్రమల 40 దినాలలో ఉన్న క్రైస్తవ బోధకులు, విశ్వాసులు అహర్నిశం దేశం కోసం ఎన్నో ప్రార్థనలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు మానుకొండ డల్లా, మరనాత ఎలీషా, పాస్టర్ రవికుమార్, శామ్యూల్ మాస్టార్, బేబీ సరోజిని, లాల్ నెహ్రూ, మెండెం జేమ్సు, పాస్టర్ వినోద్, టైటస్, ప్రసాద్, పాస్టర్ ఎజ్రా శాస్త్రి, దినకరన్, కరుణమ్మ, రాజబాబు, లూక్సన్, శ్యాంబాబు పాల్గొన్నారు.

పాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారణ జరపాలి