
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
భీమడోలు: సూరప్పగూడెంలోని పాత సుగర్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సూరాబత్తుల సాయిబాబు (30) పాత షుగర్స్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డ్గా పని చేస్తున్నాడు. ఈనెల 24వ తేదీన ఫ్యాక్టరీలో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల షిఫ్ట్లో పని చేసేందుకు వెళ్లాడు. అయితే రాత్రి 10 గంటలకు షిఫ్ట్ దిగవలసి ఉండగా రిలీవర్కు ఆతను కనిపించలేదు. ఫ్యాక్టరీలో ఉన్న చెరువు పక్కన దుస్తులు కనిపించడంతో అతని కోసం చెర్వులో వెతకగా బుధవారం అతడి మృతదేహం లభ్యమైంది. మృతుడి తండ్రి చిరంజీవి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసినట్లు ఎస్సై వై.సుధాకర్ తెలిపారు. కాగా మనస్పర్థల కారణంగా భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో సాయిబాబు మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు.