డయల్‌ 112 సేవలు వేగవంతం | - | Sakshi
Sakshi News home page

డయల్‌ 112 సేవలు వేగవంతం

Jun 26 2025 6:45 AM | Updated on Jun 26 2025 6:45 AM

డయల్‌ 112 సేవలు వేగవంతం

డయల్‌ 112 సేవలు వేగవంతం

ఏలూరు టౌన్‌: ఏలూరు జిల్లాలో అసాంఘిక శక్తుల ఆట కట్టించటం.. డయల్‌ 112 సేవలు మరింత వేగవంతం చేయడం.. ట్రాఫిక్‌ నియంత్రణకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన హైటెక్‌ బుల్లెట్‌ వాహనాలను జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్‌ శివకిషోర్‌ బుధవారం ప్రారంభించారు. ప్రజలకు ఈ వాహనాలపై అవగాహన కల్పించేందుకు ఎస్పీ స్వయంగా బుల్లెట్‌ నడుపుతూ.. నగరంలో సిబ్బందితో కలిసి ర్యాలీ చేశారు. ట్రాఫిక్‌ పరిస్థితులు స్వయంగా పరిశీలించటంతోపాటు, ఆధునిక బుల్లెట్‌ వాహనాల పనితీరు ప్రజలకు తెలియజేసేందుకు కొద్దిసేపు నగర వీధుల్లో పర్యటించారు. అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, డీటీసీ డీఎస్పీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement