
డయల్ 112 సేవలు వేగవంతం
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలో అసాంఘిక శక్తుల ఆట కట్టించటం.. డయల్ 112 సేవలు మరింత వేగవంతం చేయడం.. ట్రాఫిక్ నియంత్రణకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన హైటెక్ బుల్లెట్ వాహనాలను జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ బుధవారం ప్రారంభించారు. ప్రజలకు ఈ వాహనాలపై అవగాహన కల్పించేందుకు ఎస్పీ స్వయంగా బుల్లెట్ నడుపుతూ.. నగరంలో సిబ్బందితో కలిసి ర్యాలీ చేశారు. ట్రాఫిక్ పరిస్థితులు స్వయంగా పరిశీలించటంతోపాటు, ఆధునిక బుల్లెట్ వాహనాల పనితీరు ప్రజలకు తెలియజేసేందుకు కొద్దిసేపు నగర వీధుల్లో పర్యటించారు. అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, డీటీసీ డీఎస్పీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.