
వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు
బుట్టాయగూడెం/చింతలపూడి: వైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ విభాగం ఆర్టీఐ వింగ్ సెక్రటరీగా జీలుగుమిల్లి మండలం పి.అంకంపాలెంకు చెందిన తగరం రాంబాబు నియమితులయ్యారు. అలాగే పార్టీ రాష్ట్ర ఐటీ వింగ్ కార్యదర్శిగా లింగపాలెం మండలం ముడిచర్ల గ్రామానికి చెందిన ముల్లంగి వేణురెడ్డిని నియమించారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. వేణురెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ఐటీ విభాగం జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. తమను రాష్ట్రస్థాయి పదవుల్లో నియమించినందుకు వీరిద్దరూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
డీఎస్సీ పరీక్షకు 541 మంది హాజరు
ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలో బుధవారం నిర్వహించిన డీఎస్సీ పరీక్షలకు మెత్తం 541 మంది హాజరయ్యారు. సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం పరీక్షలకు 100 మందికి 88 మంది హాజరు కాగా, మధ్యాహ్నం సెషన్లో 100 మందికి 97 మంది హాజరయ్యారు. సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 200 మందికి 179 మంది హాజరు కాగా, మధ్యాహ్నం సెషన్లో 199 మందికి గాను 177 మంది హాజరయ్యారు.
వెలిగిన వీధి లైట్లు
ద్వారకాతిరుమల: ‘చెరువు వీధిలో చిమ్మ చీకట్లు’ శీర్షికన సాక్షి దినపత్రికలో బుధవారం ప్రచురితమైన కథనంపై పంచాయతీ అధికారులు స్పందించారు. వీధిలైట్ల విద్యుత్ సరఫరాలో ఏర్పడిన లోపాన్ని సరిచేశారు. దాంతో వీధిలైట్లు పూర్తి స్థాయిలో వెలిగాయి. ఈ క్రమంలో డ్రైనేజీలను శుభ్రం చేసే పనులను కూడా ప్రారంభించారు. పారిశుధ్య కార్మికులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పలు డ్రెయిన్లను శుభ్రం చేశారు.

వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు

వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు

వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు

వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు