రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపిక

Sep 22 2023 12:46 AM | Updated on Sep 22 2023 12:46 AM

కలిదిండి మండలం భాస్కరరావుపేట ఉన్నత పాఠశాల నుంచి ఎంపికై న విద్యార్థులు   - Sakshi

కలిదిండి మండలం భాస్కరరావుపేట ఉన్నత పాఠశాల నుంచి ఎంపికై న విద్యార్థులు

కై కలూరు: స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా తరఫున గుడివాడ ఎన్టీఆర్‌ స్టేడియంలో రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలు బుధవారం జరిగాయి. ఈ పోటీలలో రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ పోటీలకు కై కలూరు నియోజకవర్గం నుంచి పలువురు ఎంపికయ్యారు. ఆయా పాఠశాలల్లో ఎంపికై న క్రీడాకారులు, వ్యాయోయ ఉపాధ్యాయులను హెచ్‌ఎంలు గురువారం సన్మానించారు. కలిదిండి జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఎస్‌.హర్షవర్థిని(అండర్‌ – 14), కె.శృతి(అండర్‌ – 17), అండర్‌ – 14 విభాగంలో భాస్కరరావుపేట ఉన్నత పాఠశాలకు చెందిన సీహెచ్‌.సుధాధనలక్ష్మీ, అండర్‌ – 17 విభాగంలో జె.ప్రసన్న రాణి, పి.మౌనిక, ఎస్‌.చరిష్మా, మండవల్లి మండలం చింతపాడు ఉన్నత పాఠశాల నుంచి అండర్‌ – 17 విభాగంలో ఎం.భానుచందర్‌, జె.మంజుభగవాన్‌ రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ పోటీలకు ఉమ్మడి కృష్ణాజిల్లా తరఫున ఎంపికయ్యారు. ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు స్వర్ణకుమారి, కె.పాండురంగారావు, కెఎస్‌ఎస్‌ఎస్‌.ఆంజనేయులు, పీడీలు ఏ.మావుళ్ళేశ్వరరావు, బి.కృష్ణకుమారి, కె.రత్నదాసు, డి.సుబ్బారావు, రవిబాబు, పాఠశాల అభివృద్థి కమిటీ చైర్మన్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement